Pages

Showing posts with label Chenchus. Show all posts
Showing posts with label Chenchus. Show all posts

Saturday, 19 July 2014

Home

అడవి చెంచుల్ని ఆదుకోవాలి - గంగాపురం లాలయ్య

Published at: Sunday  20-07-2014 01:17 AM Edit page
గిరిజన తెగలలో చెంచులు, ఎరుకలు, లంబాడీ కులాలవారు ప్రధానంగా ఉన్నారు. లంబాడీలు, ఎరుకల కులస్థులు గ్రామాలలో, మైదాన ప్రాంతాల్లో నివసిస్తుండడంతో చెంచులతో పోలిస్తే సాపేక్షంగా అభివృద్ధి చెందారు. లంబాడీలు, ఎరుకల కులస్థులను గిరిజన జాతుల్లో కలిపిన పిదప తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాషా్ట్రల్లో వారు ప్రభుత్వం అందించే ప్రతీ సంక్షేమ పథకం ఫలితాలను అందుకొని చాలా వరకు అభివృద్ధి చెందారన్నది వాస్తవం. అయితే అడవుల మధ్య, కొండల నడుమ చెంచు గూడేల్లో, పెంటల్లో ఉన్న అడవి చెంచులు నాగరికతకు దూరంగా ఉన్నారు. వీరి అభివృద్ధి కోసం ప్రత్యేకంగా పథకాలను రూపొందించి, సమర్థులైన అధికారులను నియమించి క్షేత్ర స్థాయిలో ప్రభుత్వం రూపొందించిన పథకాల ఫలితాలు వారికి అందే విధంగా చర్యలు తీసుకోవాలని, నల్లమల అడవి తల్లి బిడ్డలు, గిరి పుత్రులు దీనంగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. బతుకంత చీకటి. నిలువ నీడలు లేవు తినడానికి తిండి, తాగడానికి నీళ్ళు చేయడానికి పని కల్పించినపుడే చెంచులు మనలో ఒకరుగా కలసి పోగలరన్న విషయం గుర్తుంచుకొని చర్యలు తీసుకోవాలి. ఆధునిక సమాజంలో అంతరించి పోతున్న చెంచుల జనాభాను ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని, వారి జీవన స్థితిగతులపై ప్రత్యేక ప్రణాళికలను రూపొందించి ఆ అడవి బిడ్డలను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
నల్లమల అడవి ప్రాంతంలో కొండల నడుమ నివసిస్తున్న చెంచులు కనీస మౌలిక సదుపాయాలు, వైద్య సౌకర్యం అందుబాటులో లేక ప్రాణాలు కోల్పోతున్నారు. దక్షిణ భారతదేశంలో దట్టమైన అడవులుగా ప్రసిద్ధి పొందిన నల్లమల అడవులు క్షీణించడం వల్ల చెంచుల జీవనోపాధి సంక్షోభంలో పడి ంది. రెండు దశాబ్దాల క్రితం అడుగడుగున ఉన్న వృక్షాల్ని స్మగర్లు తరలించుకుని పోవడంతో అటవీ ఉత్పత్తులు లభించక, తిండి తిప్పలు నోచుకోక అల్లాడుతున్నామని చెంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద గ్రామాలకు రహదారిలో ఉన్న చెంచు గూడేల్లో కొంత అభివృద్ధి జరిగింది. అయితే గ్రామాలకు దూరంగా నల్లమల అడవి మధ్యలో కొండల నడుమ నివసిస్తున్న చెంచుల అభివృద్ధికి జరిగిన కృషి అత్యల్పం. నిరక్షరాస్యత, ఆరోగ్యం పరిశుభ్రత గురించి తెలియని ఈ చెంచులు తరచూ రోగాల బారిన పడుతున్నారు. గిరిజన స్ర్తీలు, పిల్లల్లో ఎదుగుదల లేక రక్తహీనతతో బాధపడుతున్నారు. చెంచు గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం దశాబ్దాలుగా వందలాది కోట్లు నిధులు మంజూరు చేసినా వాటిలో నామమాత్రంగానైనా చెంచుల అభివృద్ధికి చేరుకోవడం లేదు. అధికారులు, ప్రజాప్రతినిథులు, దళారులు ఆ నిధుల్ని భుక్తం చేస్తున్నారు. గిరిజనుల అభివృద్ధి పేరుతో మంజూరయ్యే కోట్లాది రూపాయలను ఆయా అధికారులు వెనకేసుకుంటున్నారు. అడవి తల్లిని నమ్ముకుని బతుకుతున్న వారిని ఏకంగా అటవీ ప్రాంతాల నుంచి తరలించడంలో ప్రభుత్వం విఫలమైంది. అయితే అటవీ ఉత్పత్తులు తగ్గిపోవడంతో బతుకుదెరువు కోసం వలస బాటనే ఎంచుకుంటున్నారు. 1983లో పులుల అభయారణ్యంగా ప్రకటించారు. అయితే ఆ అభయారణ్యం నుంచి పులులు బయటికి వచ్చి గ్రామాలపై దాడి చేసి పశువులను కబళించడమే కాక, మనుషులపై కూడా దాడికి తెగబడుతున్నాయి. పులివాత పడి చనిపోయినవారికి ప్రభుత్వం నామమాత్రంగా చెల్లించడంతో ఎంతో మంది చికిత్స పొందుతూనే చనిపోయారు. వేల రూపాయలు విలువ చేసే పశువులు పులి దాడిలో చనిపోయిన సందర్భాల్లో ప్రభుత్వం నామమాత్ర నష్టపరిహారం ఇస్తోంది. దాంతో ఎంతో మంది ఆదివాసులు, అడవి అంచు గ్రామాల్లోని రైతులు వ్యవసాయం మానుకొన్న ఘటనలు అనేకం. చెంచులపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడం హర్షణీయం. గిరిజన జాతుల్లో లంబాడీ, ఎరుకలి కులాలవారు చాలావరకు సాంఘికంగా, ఆర్థికంగా ప్రభుత్వ పథకాల ద్వారా ఎదిగారు. ఈ నేపథ్యంలో చెంచుల సంరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక పథకాలను రూపొందించింది.
ఆర్భాటంగా, అట్టహాసంగా ప్రవేశపెట్టిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన అమాయక చెంచులకు అందేలా ప్రభుత్వం డెలివరీ మెకానిజంను రూపొందించాలి. కొత్త ప్రభుత్వంపై అడవి చెంచులు కోటి ఆశలు పెట్టుకొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాషా్ట్రలలో చెంచుల పిల్లలను సంరక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా జిల్లాకు 89 కేంద్రాలను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నల్లమల అడవుల్లోని పెంటలు, గ్రామాలు, మైదాన ప్రాంతాలలో నివాసం ఉంటున్న చెంచులు ఉపాధి పనులకు వెళ్ళటం, గ్రామాల్లో కూలీలకు వెళ్ళేటపుడు వారి పిల్లల్ని చూసుకునే వారు లేరు. దీంతో వారిని సంరక్షించేందుకు ప్రభుత్వం గత నెల 15న, జీవో 17 విడుదల చేసింది. పుట్టిన ఆరు నెలల పాప నుంచి ఆరేళ్ళ పిల్లల వరకు కేంద్రాలలో సంరక్షించనున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలను అనుసంధానం చేస్తూ, సంరక్షణ కోసం ఒక మహిళని నియమించనున్నారు. మహిళకు నెలకు వేతనాన్ని చెల్లించి నియమించనున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు.
నిత్యావసర సరుకులు సరఫరా చేయడానికి కొందరు అప్పుడప్పుడు చెంచు గూడేలకు వెళ్తున్నప్పటికీ గిరిజనులకు మాత్రం ఆశించిన స్థాయిలో నాగరికత అబ్బలేదు. ఈ చెంచులకు శాశ్వతగృహాలను నిర్మించడం జరుగుతున్నా సుదూరంగా ఉండే వారికి ఈ సదుపాయం కల్పించడానికి ఇంతవరకు అధికారులు కృషి చేయలేదు. అందువల్ల వారి జీవితాల్లో ఎలాంటి మార్పుకు అవకాశం లేకుండా పోయింది. ఉపాధి కల్పన పథకాలలో వీరికి తగిన ప్రోత్సాహం కనిపించడంలేదు. వ్యవసాయ బావులు తవ్వించడం, వ్యవసాయానికి ఎడ్లబండ్లను ఇవ్వడంలోను అడవి చెంచులకు అన్యాయం జరుగుతోంది. అధికారుల దృష్టి అంతా గ్రామాల్లోనూ, అందులోను రహదార్లకు దగ్గర ఉండే వారిపైనే ఉందనడంలో సందేహం లేదు. క్రూర మృగాల సంరక్షణ ప్రాంతాల్లో చెంచు గిరిజన గూడేలు అనాదిగా ఉన్నాయి. అంటే క్రూర మృగాల సంఖ్య పెరగడం వల్ల వారందరిని తరలించి పునరావాసం కల్పించడానికి ప్రభుత్వం ఒక పథకాన్ని రూపొందించింది. అటవీ ప్రాంతాల్లోని పెద్ద గ్రామాల పరిధిలో గిరిజనులకు గృహాలని నిర్మించాలని ప్రభుత్వ సంకల్పించినా, వారు మాత్రం పెద్ద గ్రామాలలో నివసించడానికి ఇష్టపడటంలేదు. అడవిలో చెంచులు మంచినీటి కోసం గూడెం నుంచి కనీసం మూడు కిలోమీటర్లు దూరం నడచి వెళ్ళాల్సి ఉంటుంది. ప్రభుత్వం వారి మంచినీటి అవసరాలను తీర్చేందుకు ఎలాంటి సదుపాయాలు కల్పించక పోవడం దురదృష్టకరం. గిరిజనుల అభివృద్ధికి కోసం కేటాయిస్తున్న నిధులు ఖర్చు చేయకపోవడంతో తరచూ మురిగిపోతున్నాయి. గ్రామాలకు దగ్గరగా ఉన ్న చెంచులలో కొంత నాగరికత కనిపించినా, సుదూరంగా అడవుల్లో నివసించే వారు బాగా వెనకబడి ఉన్నారు. ఆదివాసుల కోసం రూపొందించే ఏ పథకమైనా వారికి అందుబాటులోకి వచ్చే విధంగా రూపొందించాలి. గిరిజనులకు పునారావాసాలను కేవలం అడవులకు పరిమితం చేయకుండా అవసరమైతే సాధారణ జనావాసాలకు చేరువగా నిర్మించి వారి అభ్యున్నతికి రెండు తెలుగు రాషా్ట్రలు కృషిచేయాలి.
గంగాపురం లాలయ్య
విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు
http://www.andhrajyothy.com/node/114995

Sunday, 15 December 2013





Monday, Jul 27, 2009
Chenchu killed over property dispute
Special Correspondent
Photo: U.Subramanyam

Tragic end: A Chenchu tribal, who was struck by arrows, at Atmakur hospital in Kurnool district on Sunday. -
KURNOOL: The dispute over sharing of gum plants in the Nallamala forest led to murder of a Chenchu tribal in the interior Pechcheruvu hamlet in Kurnool district on Sunday. Guruvaiah (35), was struck by two arrows shot by two other Chenchus.
He died while undergoing treatment in the hospital at Atmakur on Sunday. According to reports, a dispute arose among a few families over sharing the gum yielding plants which they consider as immoveable asset inherited from ancestors. As the victim was believed to have forayed into the territory of others, the neighbours identified as Linganna and Sadhu attacked him with bows and arrows in the deep forest. After struck by the arrows, the victim was believed to have made an attempt to walk a distance but collapsed after passing the information to passers-by from his hamlet. The family members brought him home around midnight but could not shift him to a hospital immediately due to lack of communication. They could secure the service of 108 ambulance only in the morning and transport him to Atmakur hospital. The doctors struggled to save his life but could not remove the arrows. He died around noon with arrows remaining in the body.
Printer friendly page  
Send this article to Friends by E-Mail


http://www.hindu.com/2009/07/27/stories/2009072754270400.htm 

Friday, 23 August 2013



అంతరిస్తున్న ఆదివాసి అస్తిత్వాలు : ప్రశ్నార్థకంగా మారిన నల్లమల చెంచుల జీవితాలు

ఈ మధ్య కాలంలో డెబీర్స్ మైనింగ్ కు నల్లమలలో అనుమతి లభించింది అన్న వార్త, గుండెలో దడ పుట్టించింది, పోస్కో లు, వేదాంతాలు వంటి భయంకర ప్రాజెక్ట్లు, పోలవరం లాంటి(అవి) నీ(తి)టి కుంభకోణాలు మంటలు ఆరి పోనే లేదు , అడవులు , పర్యావరణం, ఆదివాసీలు, రక్షించు కోవడానికి ఉద్యమాలు నడిచి, ఆగి, నడుస్తుంటే, మరోవైపు ఈ వజ్రాల మైనింగ్ పేరుతో నల్లమల లో మరొక దెబ్బ. సహజ సంపదను దోచుకోవడంలో ఇపుడున్న ఏకైక మార్గం. భూగర్భ జలాలు, పెట్రోల్, చమురు,బొగ్గు , సున్నం గ్యాస్, జంతువులు అన్ని అయిపోయి ఉండవచ్చు , ఇపుడున్నవి, ఇనుము, బాక్సైట్ లాంటివి, రంగు రాళ్ళు, వజ్రాలు కూడ సుమా!
ఆదివాసిలంటే ఇలా ఉండును, అలా ఉండును, అందంగా ఉండును అని చెప్పుకొనే రోజు ఎంతో దూరం లేదోమో బహుశః, కొండలు, గుట్టలు, వన్య ప్రాణులు, అడవులను ఫోటోలలో, వీడియోలలలో, చూసుకొనే దుస్తితికి రావడం తద్యం అని కూడ అనిపిస్తుంది . హటాత్తుగా మనకి జంతువులపై ప్రేమ పుట్టుకొచ్చింది, అదికూడా అడవుల్లోనే, ఎక్కడైతే తర తరాలుగా, అడవి జంతువులతో మమేకమై జీవిస్తున్న ఆదిమ జాతులున్నారో అక్కడ మాత్రమె ‘జంతు సంరక్షణ’ పేరుతొ, జంతువులతో అవినాభావ సంబంధం ఉన్న ఆదివాసీలను ఎరివేసి, వారి బతుకును వారిని బతక నీయకుండ చేసి, ‘గ్రీన్ హంట్ ‘ పేరుతొ మావో లను ఎరివేస్తాము అని, ఆదివాసిలను భయ బ్రాన్తులకు గురి చేసి, కోట్లాది రూపాయలు పోలీసులు, రకరకాల బలగాల పై ఖర్చు పెడుతూ, మరో వైపు జంతువులను కాపాడుతున్నాము అని వాటి సంరక్షణ కొరకు మరి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాఋ . అసలు జంతువులు ఉన్నట్లు ప్రభుత్వం కళ్ళు తెరిచింది ఎపుడు? అవి అంతం అయి పోవడానికి ఆదివాసీలే కారణం అని జ్ఞానోదయం అయింది ఎపుడు? ఎలా? ఎన్ని సాక్షాలు తీసుకొని, ఎన్నో కోట్లు గుమ్మరించి, సాధించిన ఘన విజయాలు గత పదేళ్ళలో ఏమిటి? అడవులలో అన్నలు ఉండును, అవి వారికి నివాస స్థలాలు , ఆదివాసీలు ఆతిద్యం ఇచ్చును అని తమ మానాన తాము బ్రతుకుతూ, ‘సో కాల్డ్’ నాగరిక సమాజానికి దూరంగా ఉన్న అమాయక ఆదివాసిలను హింసిస్తూ , విడగోడుతూ, చెడగోడుతూ ‘సాల్వ జుడుం’ లాంటి ‘ముఠా’ లను తయారు చేసి వారి మధ్యే చిచ్చు పెట్టి ఒకరిని ఒకరు చంపుకునే స్తితికి తీసుకు వచ్చిన ‘(అ)ప్రజాస్వామ్య’ ప్రభుత్వాలు, అంతరిస్తున్న అత్యంత విలువైన ఆదిమ జాతుల మనుగడ ప్రస్నార్తకంగా మారడానికి ఏ రకముగా భాద్యత వహిస్తాయి? నేడు ప్రపంచానికి ఏమని సమాధానం చెపుతాయి? దేశ వ్యాప్తంగా నేడు ఆదివాసిల పరిస్తితి దాదాపుగా ఒకే రకంగా ఉన్నా, వీరిని కాపాడడంలో, చైతన్య పరచడంలో , ఉద్యమాలు నిర్మించడంలో ఆయా ప్రభుత్వాలు, అక్కడి ప్రజల ఆర్ధిక , రాజకీయ , సామాజిక అవగాహనల పై రక రకాలుగా ఉద్యమాలు నడుస్తున్నాయి. ప్రస్తుతం నల్లమల చెంచుల పరిస్తితి దయనీయంగా మారింది, అటు పోలిసుల చేతిలో, ఇటు అటవీ శాఖ అధికారుల నిర్లక్షంతో, రోజు రోజు కు వారి జనాభా గణనీయంగా తగ్గి పోతుందీ.
చెంచులని ప్రిమిటివ్ ట్రిబల్ గ్రూప్ (PTG) గా 1975 లో (GOI 85-90 Schedule Tribe of A.P under SC & ST (modification ) order list 1956 ) క్రింద గుర్తించారు. 1991 ఇక్కడ జనాభా లెక్కల ప్రకారం 40869 , 2001 సంవత్సర జనాభా కూడ ౪౧౭౮౭, ( చైనాకి దీటుగా ఫ్యామిలి ప్లానింగ్ పాటించారు అనుకోవాలి కాబోలు) ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న చెంచులు తెలుగు మాట్లాడతారు. తరువాత నాగార్జున సాగర్ టైగర్ రిసర్వ్ (NSTR) ని 1983 ఐదు జిల్లాలో, నల్లగొండ, మహాబుబనగర్, కర్నూలు, ప్రకాశం లో 3570 స్క్వేర్ కిలోమిటర్ ప్రాంతం గా ప్రకటించారు. అయితే ఈ నల్లమల పులుల రిసర్వ్ కింద ఉన్న జనాభా ఇపుడు కేవలం 10834 , మహాబుబనగర్ లో ఏడు మండలాలలో ఉన్న జనాభా 10406 , అంటే అత్యధిక జనాభా ఉన్నది ఇక్కడనే. అప్పటినుంచి చెంచుల పరిస్తితి ఒక్కసారిగా మారింది, అడవిలో కలిసిపోయి, అడవి తల్లిని నమ్ముకున్న ప్రాణాలు ఒక్కసారిగా అడవికి దూరం చేయబడ్డాయి, చెంచులు ముక్యంగా ఆహారం సేకరించే ఆదివాసీలు, వీరికి అడవి తేనే తీయడం, దుంపలు, బంక, చింతపండు,కుంకుడుకాయలు, మొదలగునవి సేకరించడం మాత్రమె తెలుసు, బయటి ప్రపంచంతో సంబందాలు చాల తక్కువ, పులుల సంరక్షణ పేరుతొ, ఎకో టూరిసం లాంటి పేర్లతో వీరిని, అడవి పులులుగా బతుకుతున్న వీరిని కూలీలుగా మార్చి వేసినాయి.
గత వారం డాక్టర్ రామకృష్ణ(చెంచులకోసం గత కొద్ది సంవత్సరాలుగా పనిచేస్తున్నారు) , విజయభాస్కర్ (ఆదివాసిల పై పని చేస్తూన్నకార్యకర్త ) లతో మహాబుబనగర్ అప్పపూర్ కు వెళ్ళడం జరిగింది. వీరు అటవీ హక్కుల చట్టం క్రింద చెంచు హక్కులను కాపాడడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తున్నారు. చలికి చెంచులు చని పోయే పరిస్తితి ఉంది అని చెప్పడంతో ఇక్కడ, బయట దేశంలో ఉన్న మిత్రులం కలిసి దాదాపు నలుగు వందల ఉలెన్ దుప్పట్లు తీసుకొని పోవడం జరిగింది. ఇపుడు అప్పపూర్ క్రింద ఉన్న చెంచు పెంటలు జనాభా దాదాపుగా ఆరు వందలు ఉండవచ్చు. ఇక్కడి ప్రాంత ఆదివాసిలను చూసాక, ఇక్కడ ప్రబుత్వం, సబ్య సమాజం, భాద్యత గల సంస్తలు ఏమాత్రమైన వీరి గురించి ఆలోచిస్తున్నాయ అని అనుమానం కలిగింది, అవును అందరం ప్రబుత్వం మీద వదిలివేస్తే ఏమవుతుంది మరి? ఆదివాసీలు ఎందుకు మన చరిత్రలో భాగం కారు? నేడు ఉవ్వెత్తున ఎగసి పడుతున్న తెలంగాణా ఉద్యమంలో వీరి అధ్యాయం, వీరి భాగస్వామ్యం , హక్కులు ఎవరు మాట్లడరెండుకో? అక్కడికి పోవడానికి ఈ నాటికి సరి అయినా దారి లేదు, వొక్కరి మొహాల్లో కూడ కొద్దిగా ప్రసాంతత లేదు, ఎందరో చావుకు ఎదురు చూస్తూ, నిరాశా నిస్పృహలతో ఆకలికి అలమటిస్తూ, అనారోగ్యంతో బాద పడుతూ కనిపించారు, కనీస నీటి వసతి లేదు, కారణాలు వెతికితే అనేకం. అక్కడ నక్సల్ భయంతో ఆఫీసర్లు రారు, సరి అయిన , సరి పడే సిబ్బంది లేరు, పోవడానికి ఎవరు సిద్దంగా లేరు, పోయే వారు స్వచ్చంద సంస్తలు కాకపొతే వారు తప్పకుండా నక్సల్ అయి ఉంటారు అని అనుమానం, జి వో లు , ఎన్ జి వోలు , మావోలు, ఈ ముగ్గురు మాత్రమె ప్రబుత్వ లేక్ఖల్లో ఉంటారు, మానవత్వం ఉన్న వారు, మచ్చలేని వారిని మావోలు అంటే, మామూలు వాళ్ళందరూ కూడ ఆ కోవలోకే వస్తారేమో. అన్ని ఉంటె, ఐ టి డి ఏ దగ్గర డబ్బులు ‘ఆదివాసిలకి’ మాత్రమె లేవు. అక్కడ ఎపుడు చెంచులకి సంబందించిన అధికారులు కాని, పని చేసే వారు కాని ఉండరు, ఎక్కడ అమాయకత్వం ఉంటుందో అక్కడ దోపిడీ యదేచ్చగా జరుగును.
పచ్చగా నేల , సెలయేళ్ళతో గల గల లాడే నీటి చప్పుడు నేడు ఎందుకు లేవు? ఆదివాసిలంటే విల్లంబుల తో బలిష్టంగా కండలు తిరిగే అవయవ సౌష్టవంతో నేడు ఎందుకు కనిపించడం లేదు? చెంచు లక్ష్మి లాంటి అందమైన స్త్రీలు ఎందుకు కరువైయ్యారు? ఇప్పటికి ఇక్కడ స్త్రీలు అనేక ఆరోగ్య సమస్యలతో ఉన్నారు, ముద్దుగా, బొద్దుగా చిన్న పిల్లలు ఎందు లేరు? ఒక్క సారి అక్కడి పిల్లలను చూస్తె ఎవరైనా చలించక మానరు. స్వతంత్రం సంపాదించుకున్న తరువాత పెరగ వలసిన జనాభా ఎందుకు తగ్గి పోతుందీ? ఇందులో దాగి ఉన్న జాతీయ , అంతర్జాతీయ కుట్రలు ఎందుకు దాయ బడుతున్నాయి? ఒక వైపు క్లైమేట్ చేంజ్ అంటూనే, అడవులని, గుట్టలని ద్వంసం చేస్తూన్న ప్రబుత్వ విధానాల పాలసీ ఎవరికీ అర్థం అయితుంది, దైవ భాష అవసరమా?
అప్పపూర్ క్రింద రాంపూర్, జూర పూర్, పుల్లయపల్లి, ఆగర్ల పెంట, ఈర్ల పెంట, మేదిమల్కల, సంగిది గుండాల, లింగ భేరి, యమల పాయ వాగు, దోగాల పెంట, ప్రహబాద్, మల్లాపూర్ ఊర్లు ఉన్నాయి. ప్రజలు కనీస వసతులు లేక, బతకడానికి ఒక చోటు నుండి మరొక చోటికి పోతూ ఉంటారు. ముక్యంగా నీటి వసతి ఏర్పాటు చేస్తే వీరి వలసలని తప్పకుండ ఆపగలరు. వలసలకి పేరు గాంచిన మహాబుబనగర్, ఇక్కడ ఉన్న అడవిలో కల బావులు, చెరువులు పూడిక తీస్తే , ముక్యంగా మేడిమలకల పాత చెరువు, ఫర్హబాద్ పిచ్చికుంట్ల వాగు, బావ్రంపూర్ బావ్రమ్మ చెరువు, రాంపూర్ పాట కుంట లాంటివి బాగు చేసుకుంటే, ఇక్కడ చిన్న చిన్న పంటలు, పండ్లు, కూరగాయలు, పిల్లలకి , ఇంటి అవసరాలకి నీరు సమకూరుస్తే అనేక ఆరోగ్య సమస్యలు దూరమైతాయి. వలస కూలీలకి కూడ తమ ప్రాంతం లో బాగు చేసుకున్న ఫలితం దక్కుతుంది. ఇక్కడ ఎలాంటి సమాచార వ్యవస్థ కూడ నేటికి లేదు, కరెంట్ సౌకర్యం లేదు, వాళ్ళో వీల్లో సోలార్ దీపాలు ఇస్తున్నా కూడ ఎక్కువ కాలం పని చేకుండా పోవడంతో పిల్లలకి, పెద్దలు కూడా ఇబ్బందుల పాలు అవుతున్నారు.
రిసర్వ్ ప్రాంతంలో ఉన్న చెంచుల బాగు కోసం ఐ టి డి ఏ(integrated tribal development agency) , జి సి సి, (girijana co operative society) ఎఫ్ డి (forest department) పని చేయడానికి ఉన్నాయి, వీరి కోసం శ్రీశైలం లో ఐ టి డి ఏ ఏర్పరచారు. అయితే ఇక్కడ ఎటువంటి విద్య, వైద్య, సౌకర్యాలు కాని సరిగా లేవు, చెంచులు సేకరించిన అటవీ ఉత్పత్తులు జి సి సి లో ఇస్తే గాని వారికి సరి ఐన తిండి దొరక కుండా చేసారు, ఇక్కడ కేవలం వారానికి ఒక రోజు మాత్రమె ఈ జి సి సి ఉంటుంది, అసలు ఈ జి సి సి విలువైన అటవీ ఉత్పత్తులకి సరి ఐన మూల్యం చెల్లిస్తుంద? అదో పెద్ద అర్థం కాని ప్రశ్న నేటికి కూడ.. టైగర్ రిసర్వ్ ‘పులుల’ కోసమా లేక మైనింగ్ మాఫియ కోసమా అని ఇపుడు అందరికి అనుమానం కలుగుతుంది. పులులు కేవలం నల్లమల లోనే కాకుండా అనేక ప్రాంతాలలో ఉన్నాయి, కరీంనగర్, ఆదిలాబాద్ లాంటి ప్రాంతాలలో అనేక వన్య ప్రాణులు గ్రానైట్, ఓపెన్ కాస్ట్ మైనింగ్ లకి బలి అవుతున్నాయని ఫారెస్ట్ అధికారులే చెపుతున్నారు, అక్కడ లేని ప్రేమ ఇక్కడ ఎందుకు? వన్య ప్రాణులు ప్రతి గుట్ట మీద ఉన్నాయని మొర పెట్టుకుంటుంటే పట్టించుకోని ప్రభుత్వాలు ఈ కపట ప్రేమ నెందుకు ప్రదర్సిస్తున్నట్టు?
ఇట్లా చెప్పుకుంటూ పొతే ఎన్నో, ఎన్నెన్నో..ఇపుడు మనం ఎం చేయాలి? దయ చేసి ఎందుకు చేయాలి అని అడగ కండి.. సమాజం లో ఏ ఒక్కరు మన క్రింది స్తాయి లో ఉన్నా, వారికి మనం చేయూత ఇవ్వడం మన బాద్యత, అందునా అన్యం పుణ్యం ఎరుగని వారు, చదువుకున్న, స్వార్థ పరులకి బలి అవుతుంటే మనమందరం వారికి తోడుగా ఉండాలి. ఈ ఆదిమ జాతులు మన ప్రాంతానికి, ఏ ప్రాంతానికి అయినా ఒక అమూల్య సంపద లాంటి వారు, వీరినుండి మనం నేర్చుకోనేవి ఎన్నో విషయాలు ఉన్నవి, మరుగున పడిన, మనం మరిచి పోయిన మనవ విలువలు కోకొల్లలు, వారొక గొప్ప సంస్కృతీ కి చిహ్నాలు, ఎంతో మంది ఉద్యమ కారులు కష్టపడి అడవులని, ఆదివాసిలని రక్షించడానికి అటవీ హక్కుల చట్టాన్ని తీసుకొచ్చారు. వీరి దాక వాటిని తీసుకుని పోయే బాద్యత మనదే.
ప్రస్తుతం చెంచుల కి మనం అందరం కలిసి అటవీ హక్కుల ప్రకారం వారి హక్కులు దక్కేలా చూడాలి. చెంచు రిసర్వ్ వారికి దక్కేలా అంటే (దాదాపు ఒక లక్ష ఎకరాలు) వారికి ఇవ్వాలని హైమన్ డార్ఫ్ అనే మనవ శాస్త్ర వేత్త 1941 సంవత్సరంలో ప్రతిపాదించారు. నిజాం ప్రిన్సిలి స్టేట్ గవర్నమెంట్ 01-03-1942 లో నల్లమల చెంచు ప్రాంతం వారికే చెందుతుందని డిక్లేర్ చేసారు. ఈ హక్కులతో చెంచులు వారికి కావలసిన రీతిలో వారు వారి అభివ్రుధిని నిర్వచించు కోవచ్చు. ప్రస్తుతం అనేక సంస్తలు నల్లమలలో చెంచుల కోసం పని చేస్తున్నాయని చెపుతున్నాయి, వారు చేస్తూన్న పనులు, వారు తెచ్చుకుంటున్న నిధులు చెంచుల కు తెలియ చెప్పాలి, అక్కడి అధికారులకి, ప్రజలకి అందుబాటులో ఉండేటట్టు చూడాలి, నేడు కార్పొరేటు ‘ఘనులు’ స్వచ్చంద సంస్థల రూపంలో రావడం సర్వ సాధారణం అయి పోయింది, ఇన్ని సంస్థలు ఉంటె చెంచుల జీవితాలు ఎందుకు మెరుగు కావడం లేదో వారు కూడ సమాధానం చెప్పాలి. సంబందిత జిల్లా శాఖ అధికారులు, అడవిలో ఉన్న ఈ అమాయక ప్రాణులను , జంతువులతో పాటు కాపాడ వలసినది గా వారు కోరుతున్నారు. మరొక విచిత్ర మైన విషయం ఏమిటంటే, నక్సల్ ఇక్కడ లేరు అని ప్రకటించుకున్న ప్రభుత్వాలు ఎందుకు వీరిని హిమ్సిస్తున్నాయో వివరించాలి. రాలి పోతున్న ప్రతి ప్రాణానికి మనమందరం బాద్యత వహించాలి. డాబర్, దేబియర్స్ లాంటి కంపనీలు ఇక్కడికి రాకుండా చూసుకోవాల్సిన బాద్యత ఎవరు తీసుకుంటారు? తీసుకొని వారు సమాజంలో భాగస్వాములు ఎలా ఎయితారు? ప్రశ్నలతో ముగిస్తున్నాను, కొన్ని సమాధానాలతో మీ అందరి సహకారం ఆశిస్తున్నాను. మన నల్లమలని, మన చెంచులని, మన వన్య ప్రానులని కాపాడుకుందాం! రేపటి ఆదివాసి తెలంగాణా, ఆదివాసి రాయల సీమ, ఆదివాసి ఆంద్ర కోసం ఉద్యమిద్దాం!

 నల్లమలలో నమస్తేఆంధ్ర …2 Source : http://www.namastheamerica.com/?p=14360

శ్రీశైలం – హైదరాబాద్ రహదారిలో మన్ననూరు చెక్ పోైస్టు దాటాక 15 కిలోమీటర్లు నల్లమల అడవిలో ప్రయాణిస్తే ఫరహాబాద్ వ్యూపాయింట్ కు వెళ్లే చోట చెక్ పోస్ట్. అక్కడి నుండి అడవిలోకి 18 కిలోమీటర్లు ప్రయాణిస్తే అప్పాపూర్ పెంట. ఈ అడవిలో ఉన్న పెంటలన్నింటికి ఇదే పెద్దన్న. ఈ పెంట చుట్టూ 20 పెంటలకు అప్పాపూర్ ప్రధాన కేంద్రం.
అయితే దీని చుట్టూ ఉన్న పెంటలలో లింగంబెర్రి పెంట, కడ్తిబోడు పెంట, ధారవాగు పెంట, జీవగుండం, బల్జీరాం పెంట, గోకరాగు, పంది మర్రి పెంట, రాయలేటి పెంటలు ఇప్పుడు మాయమయ్యాయి. సరైన వైద్య సదుపాయాలు అందక వ్యాధుల బారిన పడిన చెంచులు క్రమంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో అక్కడ మిగిలిన వారు ఇతర పెంటలకు తరలిపోయారు. 
ఇప్పడు అడవిలో సంగిడి గుండాల, భౌరాపురం, ఫరహాబాద్, పుల్లాయపల్లి, మల్లాపూర్, రాంపురం, అప్పాపూర్, మేడిమల్కల, ఈర్లపెంట, ఆగర్ల పెంట, తాటిగుండాల, ఏములపాయ వాగు పెంటలే ఇప్పుడు మిగిలాయి. ప్రతి పెంటకు నాలుగు నుండి పది చెంచు కుటుంబాలు ఉంటాయి. వ్యాధుల బారిన పడి ఒక్కొక్కరు మరణించగానే మిగిలిన వారు వేరే పెంటలకు వెళ్తున్నారు. అయితే అప్పాపూర్ లో మాత్రం అన్నింటి కంటే ఎక్కువగా 70 కుటుంబాల వరకు ఉండేవి. ఇప్పుడు అక్కడ కూడా 50 కుటుంబాల లోపే మిగిలారు. ఇళ్లున్నా చాలామంది బయటకు వలస వెళ్లారు.
నల్లమలలో నక్సల్స్ ఉన్పప్పుడు వారికి చెంచులు సహకారం అందిస్తున్నారన్న నెపంతో అప్పాపూర్ చుట్టూ ఉన్న పెంటల చెంచులను పోలీసులు బలవంతంగా అప్పాపూర్ కు రప్పించారు. దీంతో వారికి జీవనం కష్టంగా మారింది. ఆ విధంగా కూడా కొంత మంది తరలిపోగా, మరికొందరు అనారోగ్యంతో చనిపోయారు. నక్సల్స్ భయంతో వైద్యసదుపాయాలు కూడా చెంచులకు తక్కువగానే అందేవి. దీంతో ఎక్కువమంది టీబీ, మలేరియా వ్యాధులతో మరణించారు.
అప్పాపూర్ లోనే  ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల, గిరిజన సహకార డిపో. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం  ఇక్కడ ఉన్నాయి.  అడవిలో చెంచులు సేకరించే తేనె, గోందు (gum), కుంకుడు కాయలు, చింతపండు తదితర అటవీ సంపదను  ప్రతి గురువారం అప్పాపూర్ లోని గిరిజన డిపోకుతీసుకువస్తారు. అక్కడ ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు సేకరించిన వాటిని అమ్మి తమకు అవసరం ఉన్న బియ్యం, పప్పు, సబ్బులు, బెల్లం, పుట్నాలు తీసుకుంటారు. నిత్యావసరాలు తీసుకోగా అదనంగా వచ్చే డబ్బును చెంచులు నగదు రూపంలో తీసుకుంటారు.
అయితే ఇక్కడ ఆశ్రమ పాఠశాల ఉన్నా లేనట్లే. ఇక గతంలో ఇక్కడ ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రతి బుధవారం పనిచేసేది. ఏడాది క్రితం దానిని కూడా ఇక్కడి నుండి తరలించి శ్రీశైలం రహదారిలో ఉన్న వటువర్లపల్లికి తరలించారు. దానికి అక్కడ పక్కా భవనం కూడా నిర్మాణమవుతోంది. అడవిలోకి వెళ్లడం కష్టమవుతుందని తాత్కాలికంగా తరలిస్తున్నట్లు చెప్పి అప్పట్లో వటువర్ల పల్లికి తీసుకెళ్లిన ఆసుపత్రి మళ్లీ అప్పాపూర్ కు వచ్చే పరిస్థితి లేదు. సరిగ్గా పది రోజుల క్రితం మల్లాపూర్ పెంటకు వచ్చిన జిల్లా కలెక్టర్ ను చెంచులు అప్పాపూర్ ఆసుపత్రి గురించి అడిగారు. కానీ ఎలాంటి హామీ వారికి రాలేదు. ఇప్పుడు ఆ కలెక్టర్ కూడా పదవీ విరమణ చేశారు. చెంచులకు అనారోగ్యంగా ఉన్నప్పుడు మందులు అందించేందుకు ప్రతి చెంచు పెంటకు ఓ మహిళా కమ్యూనిటీ హెల్త్ వర్కర్ ను నియమించారు.
వారి వద్ద మలేరియా, కడుపునొప్పి, జ్వరం, వాంతులు, విరేచనాలు వంటి వ్యాధులకు మందులు ఉంచుతున్నారు. ప్రతి బుధవారం ఓ వాహనంలో ఇక్కడికి వచ్చి వైద్యం అందిస్తున్నారు. ఇక్కడి 108 రాదు. అత్యవసర వైద్యం కోసం వెళ్లాలంటే 50 కిలోమీటర్ల దూరంలోని అచ్చంపేట పట్టణమే గతి. అప్పుడప్పుడు స్వచ్చంధ సంస్థలు నిర్వహించే మెడికల్ క్యాంపులే చెంచులకు ఆధారం. కాకపోతే గతంతో పోలిస్తే ఇప్పుడు మలేరియా వ్యాధి కారణంగాచనిపోయే చెంచులు లేరు. ఆసుపత్రి ఇక్కడి నుండి ఏకంగా తరలిపోగా, ఆశ్రమ పాఠశాల వారికి ఉన్నాలేనట్లే. ఇక ఇక్కడ చెంచులకు అవసరం వస్తున్నది ఒక్క గిరిజన సహకార డిపో మాత్రమే.
ఆశ్రమ పాఠశాలను సరిగ్గా నిర్వహిస్తే దాదాపు 60 మంది పిల్లలు అక్కడే ఉండి చదువుకోగలుగుతారు. కానీ అసలు ఇక్కడికి ఉపాధ్యాయులు రావడమే మానేశారు. అక్కడ వంట చేసేవారికి సరుకులు మాత్రం పంపి పాఠశాల నిర్వహించకుండా తప్పుకుంటున్నారు. గత విద్యా సంవత్సరంలో అప్పాపూర్ చెంచులు కొందరు పాఠశాలకు రావడంలేదని ఉపాధ్యాయులను ప్రశ్నిస్తే వారి మీదే ఉపాధ్యాయులు కేసుపెట్టారట. దీంతో భయపడ్డ చెంచులు కనీసం పాఠశాల వైపు చూడడమే మానేశామని వారు వాపోయారు.
అప్పాపూర్ పెంట కు మాత్రం ప్రభుత్వ సోలార్ విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేసింది. తాగునీరు, ఇతర అవసరాలకోసం ఓ బోరు దానికి విద్యుత్ కోసం జనరేటర్ ఏర్పాటు చేసింది.  ఇక ప్రతి పెంటకు ఓ సోలార్ లైట్ మాత్రం ఇచ్చారు. తాగునీరు కావాలంటే అడవిలోని చెరువులు, చెలిమెల మీదే ఆధారపడాలి. అడవిలోని జంతువులు, చెంచులకు ఈ నీరే ఆధారం. దీంతో చెంచులు వ్యాధుల బారిన పడుతున్నారు. గతంలో ఐటీడీఏ నుండి ఓ సంచార వైద్యవాహనం ఉండేది. ఇప్పుడు అది కూడా రావడం లేదు.
ప్రభుత్వం పథకాలు ఎన్ని పెట్టినా అవి క్షేత్ర స్థాయిలో చెంచులకు అందించడంలో పూర్తిగా విఫలమవుతోంది. అందుకే గిరిపుత్రులకు అడుగడుగునా గండాలు ఎదురవుతున్నాయి. పథకాలను ఆచరణలో అమలు చేస్తేనే చెంచుల పరిస్థితి మెరుగవుతుంది.
సశేషం..


Andhraprabha

డొక్కలెండుతున్న నల్లమల చెంచులు..

apr -   Sat, 6 Apr 2013, IST
  • కొండెక్కిన గిరిజన వైద్యం..
  • పట్టించుకోని ఐటిడిఏ అధికారులు..
  • మరణమృదంగంలో చెంచులు..
ఆత్మకూరు టౌన్‌, ఏప్రిల్‌ 5 (కెఎన్‌ఎన్‌) ఆహారపు దశ దాటని ఆదిమ గిరిజనుల డొక్కలెండుతున్నాయి. నల్లమల అడవులలో జీవనం సాగిస్తున్న చెంచుల స్థితిగతులు చూస్తే ఉన్న ప్రాణం ఊడినంత పనైంది. సంపన్నులే సరైన వైద్యం చేయించుకోలేక బాధపడుతున్న తరుణంలో చెంచుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐటిడిఏ అందినంత దోచుకుంటూ డొక్కలెండిన చెంచుల ప్రాణాలను అరిస్తుంది. చెంచుల అభివృద్ది కోసం నాలుగు జిల్లాలలో విస్తరించిన ఐటిడిఏ నేడు అందినంత దోచుకుని ఆదిమ జాతికి చెందిన గిరిజనుల పాలిట శాపంగా మారింది. నల్లమల కొండలలో దాదాపు 14 చెంచు గూడేలు ఉన్నాయి. వాటి పరిస్థితి తలచుకుంటే అగమ్య గోచరం తప్ప ఆలోచనా శక్తి ఉండదు. కీకారణ్యంలో తిండికోసం కొట్టుమిట్టాడుతున్న చెంచుల సంగతి అంతా ఇంతా కాదు. ఆత్మకూరు అటవీ డివిజన్‌ పరిధిలో ముఖ్యంగా 42 చెంచు గూడేలు ఉన్నట్లు తెలుస్తొంది. కొత్తపల్లి మండలంలో ఉన్న ఎర్రమఠం, జానాల గూడెం, పాతమాడుగుల గూడెం, గుమ్మడాపురం, శివపురం గూడుం, ముసలిమడుగు గూడెం, పాలెంచెరువు గూడెం, ఎదురుపాడు గూడెం చెంచులు జీవిస్తున్న పరిస్థితి చూస్తే చలించినంత పనవుతుంది. అసలే చెంచులు ఆపై ఆరోగ్యస్థితి గతులు తెలియని వారు కావడంతో ఆనారోగ్య భారిన పడి తనువు చాలిస్తున్నారు. కొండా కోనలలో అటవీ ఫల సాయంపై, జంతువుల మాసం తింటూ జీవనం సాగిస్తున్న చెంచులకు మాయదారి రోగాలతో చెంచులు తల్లడిల్లిపోతున్నారు. నల్లమలలో జం తు జీవరాశులతో మమేకమైజీవనం సాగిస్తున్న చెంచుల పరిస్థితి దుర్భరంగా ఉంది. కనీసం తినేందుకు తిండి, తాగేందుక నీరు లేక అర్ధాకలితో అలమటిస్తున్నారు. నాగరికతకు దూరంగా ఉంటూ తమ జీవితాలను సగంలోనే ముగించుకుంటున్న చెంచుల స్థితిగతులు చూడాల్సిన ఐటిడిఏ పట్టి పట్టనట్లు వ్యవహరిస్తుండగా పాలకులు కూడా వారి వైపు కన్నెత్తి చూడడం లేదు. చెంచుల కోసం కేటాయించిన నిధులు కొల్లగొడుతూ వారిపైనై దౌర్జన్యం చేస్తూ కాలం గడుపుకుంటున్న కొందరి అధికారుల పనితీరుపై జిల్లా కలెక్టర్‌ తీ వ్ర స్థాయిలో ధ్వజమెత్తినట్లు తెలిసింది. చెంచు గూడెంలలో అపరిశు భ్రత కారణంగా టిబి, మలేరియా, పైలేరియా వంటి రోగాలతో మంచాన పడుతున్నారు. కొందరైతే మద్య వయస్సులోనే తనువుచాలిస్తున్నారు. మరికొందరు గిరిజనుల కోసం ఏర్పాటు చేసిన వైద్య ఆలయాలు మచ్చుకైనా కనబడకపోవడం గమనార్హం. ఆత్మకూరు మండల పరిధిలో ఉన్న చెంచు గూడేలలో చెంచులు అనుభవిస్తున్న నరకం అంతా ఇంతా కాదు. నాటువైద్యం తప్ప ఆంగ్ల వైద్యం తెలియని చెంచులు ఉన్నారంటే ఆశ్చర్య పోవాల్సిందే. పట్టించుకోవాల్సిన అధికారులు జీతాలు తీసుకుంటూ పబ్బం గడుపుతున్నారే తప్ప చెంచుల స్థితి గతులను చూసే నాధుడే కరువయ్యాడు. బరువెక్కిన హృదయంతో డొక్కలు ఎండిన దేహంతో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న చెంచుల పట్ల ధైన్యం కాని, ధ్యానం కాని మానవత్వం కాని లేని మహామకుటులు ఎందరో ఉన్నారు. జిల్లా ఉన్నతాధికారులైనా, ఐటిడిఏ అధికారులైనా చెంచుల ఆనారోగ్యాలపై కాని, వారి జీవన స్థితి గతులపై దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు భావిస్తున్నారు. కీకారణ్యంలో ఎప్పుడు ఏమి జరుగుతుందోనన్న భయంతో క్రూర మృగాల మద్యన జీవనం సాగిస్తున్న వారిపై కనికరం తప్పదని చెంచుల అభివృద్ది కోరూ మానవతాదృక్పదవాదులు ఆశించడం న్యాయమే.


Visalaandhra

దుర్భర జీవితాలు గడుపుతున్న చెంచులు

Thu, 17 Nov 2011, 
మౌలిక సదుపాయాలు కూడా అందని వైనం-కనీస రక్షణ కరువు
మహబూబ్‌నగర్‌టౌన్‌ (వి.వి) : జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో చెంచులు దుర్భర జీవితం గడుపుతున్నారు. ఎన్ని పథకాలు వచ్చినా వారికి మాత్రం సరైన ప్రయోజనాలు అందడం లేదు. కనీస సౌకర్యాలు కూడా పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నారు. రక్షణ కూడా కరువైన పరిస్థితుల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. అసలే అటవీ ప్రాంతం...విషపూరితమైన క్రిమికీటకాలు...క్రూరమృగాలతో సహజీవనం. నివాసం గుడారా లలో....ఇలాంటి స్థితిలో వారికి కనీస రక్షణ కూడా లేదు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో వివిధ చోట్ల సుమారు 20 వేల వరకు జనాభా వున్నట్లు ప్రభుత్వం అంచనా. వీరికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించి మెరుగైన జీవనం సాగించేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది. వివిధ శాఖల ద్వారా ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయల నిధులు ఖర్చు చేస్తోంది. వాటి ఫలితాలు మాత్రం చెంచులకు అందడం లేదు. ప్రభుత్వం చెబుతున్నవేమీ తమకు దక్కడం లేదని చెంచువాసులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, ఇతర శాఖల అధికారులు మిమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎప్పటికప్పుడు చెబుతున్నప్పటికీ ఎక్కడ అది ఆచరణకు నోచుకోవడంలేదనే విషయం వారి జీవన పరిస్థితులను పరిశీలిస్తే అర్థమవుతుంది. జిల్లాలోని లింగాల మండలం ఎర్రపెంటను పరిశీలించ గా...ఇక్కడి ప్రజలు దుర్భర పరిస్థితుల మధ్య తమ జీవనం సాగిస్తున్నారు. తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు మౌలిక సదుపాయాలను కల్పించడంలో ఈ ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు. తమకు వుండేందుకు ఇళ్ళు కూడా లేవని, గుడారాలల్లో జీవనం సాగిస్తున్న తమను పట్టించుకునే నాథుడు కరువయ్యాడని వారు ఆందోళన వ్యక్తం చేశారు. తమ గ్రామానికి ఇక్కడి ప్రజాప్రతినిధులు కేవలం ఓట్ల సమయంలో వస్తున్నారు తప్ప గెలిచిన తరువాత ఎవ్వరూ తమ గ్రామాల వైపు కన్నెత్తి కూడా చూడడంలేదని వారు అంటున్నారు. చెంచుల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన మాడా, ఐటిడిఎ శాఖల అధికారులు కూడా తమను పట్టించుకోవడం లేదని, వారు ఎవ్వరూ కూడా గ్రామాలను సందర్శించిన దాఖలాలు లేవని తెలిపారు. ముఖ్యంగా ఐటిడిఎ, మాడా శాఖల ద్వారా చెంచుల అభివృద్ధి కోసం అనేక పథకాలను ప్రవేశపెడుతున్నారు. వీటివల్ల చెంచులకు ఒరిగేది శూన్యమనే చెప్పాలి. ముఖ్యంగా ఇక్కడి చెంచులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వారికి ఉపాధి అవకాశాలను మెరుగుపర్చడంతో పాటు వారికి కావాల్సిన కనీస మౌలిక సదుపాయాలు, ఇళ్ల నిర్మాణం వంటి వాటిపై దృష్టి సారించాల్సిన ఈ శాఖలు తమ బాధ్యతను పూర్తిగా విస్మరించాయి. ప్రభుత్వం తమకు పక్కా ఇళ్ళు నిర్మిస్తుందని ప్రకటిస్తున్నా వాస్తవాలు మాత్రం అందుకు విరుద్దంగా వున్నాయని, ఆధికారులను కలిసి తమకు ఇళ్ళు నిర్మించి ఇవ్వాలని కోరితే మీరు సగం ఖర్చు పెడితే మిగితాది ప్రభుత్వం భరిస్తుందని సమాధానం ఇస్తున్నారని, తాము అంత సొమ్మును పెట్టే పరిస్థితి ఉంటే ఇక్కడ ఎందుకు జీవనం సాగిస్తామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 20 సంవత్సరాల కాలంలో ఎప్పుడూ ఇక్కడ ఎలాంటి ఇళ్ళు మంజూరు చేయలేదని, 20 సంవత్సరాల క్రితం ఇక్కడ ప్రభుత్వం కట్టిన ఇళ్ళు కొన్ని కూలిపోగా, మరికొన్ని శిథిలావస్థకు చేరుకున్నాయని చెంచులు తెలిపారు. ఇక్కడ ఉండే వాతావరణ పరిస్థితుల కారణంగా వివిధ రకాల వ్యాధుల బారినపడి 40 ఏళ్ళకు మించి ఎవ్వరూ బ్రతకడం లేదని, 50ఏళ్ళలోపే మృత్యువాత పడుతున్నారని వారు తెలియచేశారు. జిల్లా వైద్యశాఖ అధికారులు ఈ విషయంపై దృష్టి కేంద్రీకరించకపోడం, వైద్యులు ఎవ్వరు కూడా ఇక్కడికి రాకపోవడం వల్ల తాము వ్యాధులతో బాధపడుతున్నామని చెప్పారు. ఇక్కడి పిల్లలకు కనీస విద్యను అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.
ఇక్కడ గతంలో ఏర్పాటు చేసిన పాఠశాల ఏనాడు తెరుచుకున్న దాఖలాలు కూడా లేవు. అంగన్‌వాడి కేంద్రం సైతం శిథిలావస్థకు చేరుకుందని, ఇక్కడ నియమించిన ఉపాధ్యాయులు, అంగన్‌వాడి కార్యకర్తలు ఎవ్వరు కూడా ఈ ప్రాంతాలకు రారని వారు చెప్పారు. మరి ఇక్కడ పనిచేయాల్సిన ఉపాధ్యాయులు ఎక్కడ పనిచేస్తున్నారు, ఇక్కడ పిల్లలకు కేటాయించే అంగన్‌వాడి సరుకులు ఎక్కడికి పోతున్నాయనే విషయంపై అధికారులే సమాధానం చెప్పాల్సిన అవసరం వుంది. మొత్తం మీద ఇక్కడి చెంచులు అభివృద్ధికి అమడ దూరంలో...కటిక దారిద్య్రంలో నివసిస్తున్నారు.

Share EmailPrint
Namasthe Telangana
Namaste Telanga 22nd August 2013  

విద్యుదీకరణనకు వీడని గ్రహణం
- విద్యుత్ సౌకర్యానికి నోచుకోని నల్లమల చెంచుపెంటలు
- వెలుగునిచ్చేందుకు ప్రవేశపెట్టిన రాజీవ్ విద్యుదీకరణ యోజన
- 112 పెంటలకు విద్యుత్ సౌకర్యం ఇవ్వాలని ప్రతిపాదన
- 2006లో రూ.కోటీ 50 లక్షలు మంజూరు
- భూగర్భ విద్యుత్ లైన్ కోసం అనుమతివ్వని అటవీశాఖ
- పట్టించుకోని ప్రజాప్రతినిధులు


మహబూబ్‌నగర్, ఆగస్టు 21 (టీ మీడియా ప్రతినిధి) : మైదాన ప్రాంతంలో రాత్రిళ్లు రెండు గంటలు విద్యుత్ సరఫరా నిలిచిపోతే ప్రజలు తల్లిడిల్లిపోతారు. కరెంట్ ఎప్పుడు వస్తుందా అని కునుకు తీయకుండా ఎదురు చూస్తారు. కొద్దిసేపు అంధకారంలో ఉండేందుకు ఆందోళన చెందుతారు. గ్రామీణ ప్రాంతాల్లో బయటకు వెళ్లేందుకు జంకుతారు. వెలుతురు లేకపోవడంతో విషపురుగుల తాకిడి ఉంటుందనే భయంతో ప్రజలు బయటకు కాలు పెట్టేందుకు వెనుకంజ వేస్తారు. రెండు గంటలు విద్యుత్ లేకుంటే ఇక్కడి ప్రజల తీరు ఇలా ఉంటే అసలే విద్యుత్ సౌకర్యం లేకుంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. కరెంట్‌లేని జీవితాన్ని ఊహిస్తేనే ఒల్లుజలదరిస్తుంది. కాని ఏళ్ల తరబడి విద్యుత్ సౌకర్యానికి నోచుకోక చీకట్లోనే మగ్గుతున్నారు. పెంటల చుట్టూ అటవీప్రాంతం, చిమ్మ చీకట్లో చెంచులు బతుకీడుస్తున్నారు. చెంచులకు వెలుగునిచ్చేందుకు ప్రవేశపెట్టిన పథకాలు అమలుకు నోచుకోవడంలేదు. పథకాలను వెలుగులోకి తెచ్చేందుకు ప్రజాప్రతినిధులు చొరవతీసుకోవడంలేదు. బొడ్డుగుడిసెల్లో కటిక చీకట్లో దుర్భరంగా జీవిస్తున్న చెంచులపై ‘నమస్తే తెలంగాణ’ అందిస్తున్న ప్రత్యేక కథనం..

చెంచుపెంటల్లో చీకటి రాజ్యమేలుతుండటంతో చెంచులు, గిరిజనులు పడుతున్న కష్టాలు వర్ణాణాతీతం. ఎటూ చూసినా దట్టమైన అటవీ ప్రాంతంలో విషకీటకాల మధ్య ఏళ్ల తరబడి దుర్భర జీవితాలను గడుపుతున్నారు. విద్యుత్ సౌకర్యంలేక రాత్రి సమయాల్లో బొడ్డు గుడిసెల్లో బుడ్డి దీపం వెలుతురులోనే కాలం వెల్లదీస్తున్నా రు. చెంచుల నివాస ప్రాంతాలకు విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు 2006లో రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ విద్యుదీకరణ యోజన పేరుతో ఓ పథకాన్ని వెలుగులోకి తెచ్చింది. జిల్లాలోని కొల్లాపూర్, అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గాల్లోని నల్లమల అటవీ ప్రాంతంలో రాజీవ్ విద్యుదీకరణ యోజన కింద విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు 112 చెంచుపెంటలను అధికారులు గుర్తించి విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకున్నారు.

ఈ చెంచుపెంటల్లో దాదాపు ఏడు వేలకు పైగా జనాభా నివసిస్తున్నారు. ఈ పథకం కింద నల్లమలలోని ఫర్హాబాద్ చౌరస్తా నుంచి అప్పాపూర్ వరకు భూగర్భ విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు 2006లో ప్రభుత్వం రూ.1.50 కోట్లు మంజూరు చేసింది. కాని నేటికీ ఈ చెంచుపెంటలు విద్యుత్ సౌకర్యానికి నోచుకోలేదు. శ్రీశైలం రహదారిపై ఉన్న మన్ననూర్ నుంచి వట్టువర్లపల్లి, సార్లపల్లికి మాత్రమే విద్యుత్ సౌకర్యం కల్పించారు. ఇక్కడి నుంచి మిగతా చెంచుపెంటలకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని ఉన్నా అటవీ శాఖ అనుమతి ఇవ్వడంలేదు. అటవీశాఖ అధికారులు విద్యుత్ లైన్ ఏర్పాటుకు అనుమతి ఇవ్వకపోవడంతో విద్యుత్ సౌకర్యం నిలిచిపోయింది.

దీంతో చెంచులు విద్యుత్ సౌకర్యానికి దూరమయ్యారు. అసలే అటవీప్రాంతం కావడంతో రాత్రి అయితే చాలు చెంచులు బొడ్డుగుడిసెలకే పరిమితమవుతున్నారు. బయటకు వస్తే చీకట్లో ఏ విష కీటకం కాటేస్తుందోననే భయాందోళనలో చెంచులు బతుకుతున్నారు. వట్టువర్లపల్లి నుంచి మల్లాపూర్ వరకు విద్యుత్‌లైన్ వేసి అక్కడి నుంచి పుల్లాయిపల్లి, రాంపూర్, ఆగర్లపెంట, భౌరాపూర్, ఈర్లపెంట తదితర చెంచుపెంటలకు విద్యుత్ సౌకర్యం కల్పించే అవకాశమున్నా అధికారులు ఆ వైపు చర్యలు తీసుకోవడంలేదు. వట్టువర్లపల్లి నుంచి ఈ చెంచుపెంటలు సుమారు 30 నుంచి 50 కిలోమీటర్ల పరిధిలో ఉన్నాయి. ఐటీడీఏ గుర్తించిన ఈ చెంచుపెంటలకు రాజీవ్ విద్యుదీకరణ యోజనలో విద్యుత్ సౌకర్యం కల్పించాలనే నిబంధన ఉంది.


అడ్డుకుంటున్న అటవీశాఖ అధికారులు
రాజీవ్ విద్యుదీకరణ యోజన పథకం కింద చెంచు పెంటలకు విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా విద్యుత్‌లైన్ల ద్వారా విద్యుదాఘాతం అయితే అడవికి నిప్పంటుకునే ప్రమాదం ఉందనే నెపంతో అటవీశాఖ అధికారులు అడ్డుకుంటున్నారు. భూగర్భ విద్యుత్‌లైన్ కోసం అటవీ ప్రాంతంలో కేబుల్ వేసేందుకు కూడా అటవీశాఖ అధికారులు అనుమతి ఇవ్వలేదు. కేబుల్ వేస్తే వేటగాళ్లు భూమిని తవ్వి విద్యుత్‌ను ఎక్కడబడితే అక్కడ వాడుకునేందుకు వీలుండటంతో అటవీ ప్రాంతానికి, వన్యప్రాణులకు ముప్పు జరుగుతుందని వారు అభ్యంతరం చెబుతున్నారు.

అప్పాపూర్ వరకు రోడ్డు సౌకర్యం ఉండటంతో రోడ్డు పక్కనే కేబుల్ వేస్తే వన్యప్రాణులకు ఎలాంటి ముప్పు ఉండదని తెలిసినా ఆ శాఖ అధికారులు అనుమతిని నిరాకరిస్తున్నారు. దీంతో చెంచుపెంటలకు విద్యుత్ సౌకర్యం కలగానే మిగులుతోంది. రాష్ట్ర శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఐదు నెలల కిత్రం నల్లమల అటవీ ప్రాంతంలో పర్యటించి చెంచుల సమస్యలు తెలుసుకున్నారు. చెంచు పెంటల్లో విద్యుత్ సౌకర్యం కల్పించాలని చెంచులు స్పీకర్ దృష్టికి తీసుకొచ్చారు. చెంచు పెంటల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని స్పీకర్ హామీ ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. స్పీకర్ ఇచ్చిన హామీలు మచ్చుకు కూడా అమలుకునోచుకోకపోవడంతో ఇక చెంచుపెంటలకు విద్యుత్ సౌకర్యం కలగానే మిగులుతోంది. చెంచుపెంటల్లో విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా చొరవ చూపడంలేదు. ప్రజాప్రతినిధులకు ఐదేళ్లకు ఓసారి ఎన్నికల సమయంలో చెంచు పెంటలు గుర్తుకు వస్తాయి. ఓట్లు వేయించుకున్న అనంతరం చెంచు పెంటల్లో సౌకర్యాల గురించి మరిచిపోతున్నారు.

Andhraprabha

క్షయబారిన చెంచులు 9th October 2012 , Andhra Prabha

మహబూబ్‌నగర్‌, ప్రకాశం, కర్నూలు, నల్గొండ జిల్లాలలో 5,75,000 హెక్టార్ల విస్తీర్ణంలో నల్లమల అడవులు వ్యాపించి ఉన్నాయి ఇందులో 282 చెంచుగూడేలున్నాయి. ఈ గూడేల్లో 38000 ఆదివాసీ గిరిజన చెంచు కుటుంబాలు నివాసముంటున్నట్లు ప్రభుత్వ లెక్కలు తెలుపుతున్నాయి. వీరి జనాభా క్రమక్రమంగా క్షీణించి పోతోంది. దీనికి గల అనేక కారణాల్లో క్షయవ్యాధి ముఖ్యమైంది. ఈ వ్యాధివల్ల చాలామంది చెంచుల కుటుంబాలకు కుటుంబాలే తుడిచిపెట్టుకుపోయాయి. కరవు, క్షయవ్యాధి, ఇతరత్రా కారణాల చేత నల్లమలలోని చెంచు కుటుంబాలు స్థలమార్పిడి చేస్తుంటారు. వీరిని అడవిలోని వలస జీవుల ు అనవచ్చు. పట్టుమని పదికాలాల పాటు ఒకచోట స్థిరంగా ఉండరు. రోగాల బారినపడి చనిపోయిన వారు పోగా వారి పిల్లలు అనాథ బాలలుగా మిగిలిపోతున్నారు. ఇట్టి వారిని ప్రభుత్వం చేరదీసి విద్యాబుద్ధులు నేర్పుతుంది. అట్లావెళ్లిన వారుచాలా తక్కువే అనిచెప్పవచ్చు. అధిక శాతం అనాథ బాలబాలికలు ప్ర భుత్వం వారి ఉచిత వసతి సౌకర్యాలకు నోచుకోక చెంచు కుటుంబాల వారిమధ్యనే జీవితం ఈడుస్తూ పెరిగి పెద్దవారై చివరికి భూదేవి ఒడిలోకి జారుకుంటున్నారు.
బ్రతుకు బండి ఈడ్వలేని కొందరు చెంచులు తమ పిల్లల్ని ప్రభుత్వం వారి ఆశ్రమ పాఠశాలల్లో చేర్పించి తమ బాధ్యతలు తీరిపోయాయని చేతులు దులుపుకొంటూన్నారు. వీరిలో దుర్భర జీవితాన్ని వెళ్లదీస్తున్న కుటుంబాలే అధికంగా ఉన్నాయి.
చెంచు కుటుంబాలలో గత అయిదేళ్ల కాలంలో సుమారు నాల్గు వందలమంది దాకా కేవలం క్షయవ్యాధికి గురై చనిపోయినట్లు తెలుస్తుంది. ఒక్క క్షయవ్యాధికే ఇంతమంది చనిపోతే మిగతా వ్యాధులకు, మిగతా అనేక కారణాలుగా ఎంతోమంది చెంచుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఈ లెక్కన నల్లమల చెంచుల జనాభా నానాటికీ క్షీణించిపోతోంది. కొల్లాపూర్‌ తాలూకాలోని నార్లాపూర్‌ చెంచు గూడెంలోని 60 కుటుంబాలలో 150 మందికి పైగా నివాసముంటున్నారు. వీరిలో క్షయవ్యాధి బారినపడి అసువులు బాసిన వారెందరో! ఇట్లా చనిపోగా మిగిలిన వారిలో కూడా శక్తి లేక, జీవన సమరం సాగించలేక జీవన్మృతులైన వారు మరెందరో! అడవిలోని ఉత్పత్తులు సేకరించుకొని తెచ్చి ప్రభుత్వ సేల్స్‌ డిపోలో విక్రయించి జీవనం సాగించేవారు బహుకొద్దిమంది మాత్రమే. చాలామంది వలసవెళ్లి బ్రతుకీడ్వలేక, వాతావరణం అనుకూలించక మృతి చెందేవారుకూడా ఉన్నారు.
నల్లమల అడవుల్లో నివసించే చెంచు కుటుంబాల వారికి ప్రభుత్వ వైద్య సదుపాయాలు అందక గూడ చాలామంది మృత్యువాత పడుతున్నారు. జ్వరం మొదలైన రోగాలు వస్తే ప్రభుత్వం వారి ఆసుపత్రులకు నడచి వెళ్లలేక వనమూలికలు, ఆకుపసర్లు, కందమూలాలు మొదలైన వాటితో వచ్చీరాని వైద్య చికిత్సలు చేసుకుంటూ బ్రతికే వారు బ్రతగ్గా చనిపోయే వారు పోతూనే ఉన్నారు. కాబట్టి నల్లమల అడవుల్లోని వీరికి అనుకూలంగా వైద్యశాలలు ఏర్పాటు చేస్తే కొంతైనా మేలుగా ఉంటుంది. అడవుల్లో నివాసముంటూ చెంచులకు వైద్యసేవలు అందించే ప్రభుత్వ సిబ్బంది ఎవరూముందుకు రాకపోవడంతో అనేకమంది చెంచులు రోగాల బారినపడి మృత్యువాత పడుతున్నారు. వీరి కోసం ప్రభుత్వం ఏటా లక్షలు, కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నా వృధాగా అయిపోతుంది. అమాయకులైన చెంచుల నోళ్లు కొట్టే మధ్య దళారులు కుబేరులైపోతున్నారు. ఈ వ్యవస్థ సమూలంగా మారకపోతే ఇది ఇట్లాగే కొనసాగుతూ పోతే రాబోయే రోజుల్లో నల్లమల అడవుల్లో ఒక్క చెంచు వ్యక్తికూడా మిగలడు. రాబోయే తరాల వారికి వీరిని గురించి కథలుగా చెప్పుకోవడం తప్పిస్తే ప్రత్యక్షంగా చూసేటందుకు అవకాశాలు ఉండవు.
మహబూబ్‌నగర్‌ జిల్లాలోని నల్లమల అడవుల్లో అమరాబాదు కొల్లాపూర్‌ ప్రాంతాల్లోని అడవుల్లో చెంచులు అధికంగా ఉన్నారు. వీరు యాసతో తెలుగు భాషలో మాట్లాడుతారు. అక్కడక్కడ ఉర్దు పదాలు కూడా వీరి మాటల్లో చేరుతాయి. వీరు సంచార జీవులు. అడవుల్లోనే ఒక పెంట నుండి మరో పెంటకు మారుతుంటారు. పట్టుమని పది కాలాల పాటు ఒక్కచోట ఉండరు. వీరికి పూర్వం నిజాం ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందుతుండేది. ఆ తర్వాత వచ్చిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా వీరికి ఆర్థికంగా అన్ని సౌకర్యాలు సమకూరుస్తూనే ఉంది. ప్రతి సంవత్సరం వీరిపై ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చుచేస్తోంది. వీరి కోసం ప్రత్యేకంగా వైద్యశాలలు ఏర్పాటు చేశారు. పాఠశాలలు, ఉపాధ్యాయులు మొదలైన సౌకర్యాలు కల్పించారు. వ్యవసాయ భూములను, అరక ఎద్దులను, బండ్లను, వ్యవసాయ పనిముట్లను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఇంకా వీరికి శాశ్వత ప్రాతిపదికన పక్కాఇండ్లు కట్టించి ఇస్తున్నారు. ఆధునిక వ్యవసాయం గురించి మెళకువలను ప్రభుత్వం నేర్పుతోంది. పండ్ల తోటలు మొదలైన ఆధునిక వ్యవసాయ రంగాల్లో ఉచితంగా శిక్షణ యిస్తున్నారు. డ్రైవింగ్‌ మొదలైన అనేక వృత్తుల్లో ఉచిత శిక్షణ యిస్తూ సొంతంగా జీవించేటందుకు అనువైన అవకాశాలను ప్రభుత్వం కల్పిస్తోంది. వీరి జీవనోపాధి కొరకు అనేక పథకాలను సిద్ధపరచి వీరి అభివృద్ధి కోసం అహర్నిశలు ప్రభుత్వం మిక్కిలి శ్రద్ధ వహిస్తోంది. అడవుల్లో అక్కడక్కడ గిరిజన సహకార సంస్థ వారి ఆధ్వర్యంలో సేల్స్‌ డిపోలు ఏర్పాటు చేసి వీరికి కావలసిన నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తున్నారు. అడవుల్లోని ఉత్పత్తులను చెంచులు సేకరించుకొని వచ్చి ఈ సేల్స్‌ డిపోల్లో విక్రయించి ఆ డబ్బుతో అదే సేల్స్‌ డిపోల నుండి నిత్యావసర సరకులను తీసుకొనిపోతారు.
వీరి అభివృద్ధి కోసం ప్రభుత్వం గిరిజన సహకార సంస్థ మాత్రమే కాకుండా ఇతర స్వచ్ఛంద సంస్థలు కూడా వీరికి ఆర్థిక సహాయం, ఇతరత్రా సహాయ సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇంకా వీరికి ప్రభుత్వం ఉచితంగానో, అప్పు రూపంగానో ఆటోరిక్షాలు, జీప్‌లు, ట్రాక్టర్లు మొదలైన వాహనాలను సమకూరుస్తోంది. చదువుకున్న వారికి ఉద్యోగాలు, చదువులేని వారికి ఉపాధులు కల్పిస్తూ ప్రభుత్వం ఎంతో సేవ చేస్తోంది. ఇంత సేవ చేస్తున్నప్పటికీ, ప్రభుత్వం నుండి ఎన్నో ఉపాధి పథకాలు పొందినప్పటికీ వీరిలో ఇంకా ఆశించినంత ప్రగతి కనబడడం లేదని, వీరికి అందించే నిధులు చాలావరకు దుర్వినియోగమవుతున్నాయని కూడా విమర్శలు వస్తున్నాయి.
చెంచులు చాలావరకు ఆధునిక అభివృద్ధి సౌకర్యాలకు అనుకూలంగా జనజీవన స్రవంతిలో కలిసిపోయి వారి జీవన సరళిలో మార్పు వచ్చినప్పటికీ ఇంకా చాలామంది అడవుల్లోనే గోచీ రాయుళ్లుగా ఉంటూ ఆ ఎల్లలు దాటి గ్రామీణ జనజీవనంలో కలియలేకపోతున్నారు. వారికోసం ఎన్నో పథకాలు చేపట్టి వారి దగ్గరకే ప్రభుత్వాధికారులు వెళ్లి అనేక రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ ఆశించినంత ఫలితాలు రావడంలేదు. చెంచుల అభివృద్ధి కోసం జిల్లా కేంద్రంలోని జిల్లా గిరిజన సంక్షేమ కార్యాలయాలను సైతం మన్నానూర్‌ గ్రామంలో ఏర్పాటు చేసి వారికి ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇదిగాక ఐటిడిఏ (ఇంటిగ్రేటెడ్‌ ట్రైబల్స్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ) ప్రాజెక్టు ఆఫీసును సైతం మన్నానూర్‌ గ్రామంలో ఏర్పాటు చేసి వీరి బాగోగులను చూస్తోంది. గిరిజన సహకార సంస్థ బ్రాంచి ఆఫీసును మన్నానూర్‌ గ్రామంలో ఏర్పాటు చేసి వీరికి కావలసిన నిత్యావసర సరకులు పంపిణీ చేస్తుంది. వీరు అడవుల నుండి సేకరించుకొని తెచ్చిన అటవీ ఉత్పత్తి వస్తువులను తీసుకుంటూ వారి సంక్షేమానికి అహర్నిశలు పాటుపడుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు సమీపంలోని సుండిపెంటలో ప్రత్యేకంగా చెంచులకోసం ఐటిడిఏ ప్రాజెక్టు ఆఫీసును స్థాపించింది. దీని ద్వారా నల్లమల అడవుల్లోని చెంచులందరికీ అనగా మహబూబ్‌నగర్‌, ప్రకాశం, గుంటూరు, నల్గొండ మొదలైన జిల్లాల పరిధిలోని చెంచు కుటుంబాలకు ఈ ప్రాజెక్టు కార్యాలయం నుండి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కొంతమంది చెంచులు ప్రభుత్వం ద్వారా లబ్ధిపొందిన భూములతో వ్యవసాయం చేస్తూ పాడిపశువులను, ఎద్దులను, ఆవులను, మేకలను మొదలైనవాటిని పోషిస్తూ అభివృద్ధి పథంలో నడుస్తున్నారు.
-దరెగోని శ్రీశైలం 

www.suryaa.com/index.asp

చెంచులను కబళిస్తున్న బాల్య వివాహాలు
ఆంధ్రప్రదేశ్‌లోని 35 గిరిజన తెగల్లో అత్యంత ప్రాచీనమైన అభివృద్ధికి నోచుకోని దుర్భర దుస్థితిలో ఉన్నాయి తెగ చెంచులు. మనుస్మృతి, వల్లభరా యుడి క్రీడాభిరామం, యామునిడి రాజనీతి, జాషువా గబ్బిలం, దూర్జటి కాళహస్తిశ్వర శతకం మొదలగు రచనలలో చెంచుల ప్రస్తావన ఉంది. ప్రకృతివైద్యంలో సిద్ధ హస్తులు, భవిషత్తులో సంభవించే విపత్తులను ముందుగానే పసిగట్టగల సమర్థులు, ప్రకృతి పరిరక్షకులు చెంచులు. అహార సేకరణ ప్రధాన వృత్తిగా, మహబూబ్‌నగర్‌, ప్రకాశం, కర్నూలు, గుంటూరు, నల్లగొండ జిల్లాల్లోని నల్లమల అటవీ ప్రాంతంలో కృష్ణా నది పరివాహక ప్రాంతంలో అనేక సంవత్సరాలుగా జీవిస్తున్నా ఈ తెగలకు మిగతా జన సమూహాలతో కానీ, ఇతర గిరిజన తెగలతో కానీ దగ్గరి పోలికలు లేవు. వీరి మనస్తత్వాలు, అలవాట్లు, మానసిక, శారీరక స్థితిగతులు, సంస్కృతి భిన్నమైనవి. ఈ రోజు గడిస్తే చాలు. రేపటి సంగతి దేవుడెరుగు అనే తత్వం. మనువాద సంస్కృతి, పితృస్వామిక అజమాయిషి, నాగరికసమాజపు పోకడలు ఏ మాత్రం కనిపించని చెంచు సమాజంలో- స్ర్తీలు అత్యంత స్వేచ్ఛాసమానత్వాలు పొందుతున్నారు.

భాగస్వామి ఎంపికలో స్ర్తీకి పూర్తి స్వేచ్ఛ కల్పిం చాయి గిరిజన తెగ చెంచులు. ఇది మహిళా సాధికారతకు దోహదం చేసినా, మరో విధంగా బాల్యవివాహాలకు దారితీసి వారి అభివృద్ధికి ఆటంకంగా తయారై వారి మనుగడను ప్రశ్నార్ధకంగా మార్చివేస్తున్నది. కాలుష్యమెరుగని ప్రశాంత వాతావరణంలో చెంచులు ఎదుర్కొంటున్న, బయటి సమాజానికి తెలియని అనేక సామాజిక రుగ్మతల్లో బాల్యవివాహాలు అత్యంత ప్రమాద కరమైనవి. నాగరిక సమాజానికే పరిమితమనుకున్న బాల్యవివాహాలు ఆదిమ తెగలైన చెంచులలో విపరీతంగా జరుగుతున్నాయి. వారి బతుకులను నిర్దాక్షిణ్యంగా మింగేస్తున్నాయి. వరకట్న బాధలు, పెళ్ళిళ్ళ ఖర్చులు, హంగు ఆర్భాటాలు లేకపొయినప్పటికి నల్లమల అటవి ప్రాంతంలోని చెంచులుండే 46 మండలాల్లో బైర్లూటి నుంచి అప్పాపూర్‌ వరకు అన్ని పెంటలలో దాదాపు ఇదే పరిస్థితి.

అందుబాటులో ఉన్న బడిలో ఐదవ తరగతి వరకు మాత్రమే చదువు సాగించి, అమ్మాయికి పదకొండు, అబ్బాయికి పదమూడు సంవత్సరాల వయసొచ్చేటప్పటికి పెళ్ళి పీటల నెక్కుతున్నారు. బాల్య వివాహాల రక్కసికి బలవుతున్నారు. చెంచు తెగలలో అబ్బాయికి 13 సంవత్సరాల, అమ్మయికి 11 సంవత్సరాల వయసొచ్చిందంటే, తమను తాము స్వతంత్రులుగా భావించుకుంటారు. తమపై తల్లిదండ్రుల అజమాయిషీని ఏ మాత్రం సహించని వీరు, ఇష్టపడ్డ వ్యక్తితో కలిసి వెళ్ళిపోతారు, సహజీవనంచేస్తారు. ఇది చెంచు సమాజానికి అమోదయోగ్యమే. ఈ విషయమై తల్లి, తండ్రి ఏ మాత్రం అభ్యంతరం తెలుపరు. ఒక వేళ ఎవరైన అలా అభ్యంతరపెడితే- వారికి బంధువులు ఆశ్రయం కల్పించి దన్నుగా నిలుస్తారు. వారిని ఒక ఇంటివారిని చేస్తారు. చెంచుల సాంప్రదాయాల ప్రకారం మామ, కోడలు ఒకే కప్పుకింద నిద్రించకూడదనే ఆంక్ష ఆచారంలో ఉన్నందున కొడుక్కి కోడలిని కట్టబెట్టిన మరునాడే వేరు కాపురం పెడతారు. ఇక అప్పట్నుంచి తన కుటుంబ బాధ్యతలను తనే మొయాల్సి ఉంటుంది. పెద్దలు కొంతమేర సహాయ సహకారాలు అందించినా, కుటుంబ వ్యవహారాల్లో ఏ మాత్రం జోక్యం చేసుకోరు.

కోడలితో మాట్లాడే సాహసం అసలు చేయరు. ఇక ఏ మాత్రం పరిణతి చెందని వయసులో భార్య- భర్త హోదా పొందిన ఆ బాల బాలికల కష్టాలు వర్ణనాతీతం. బతుకు తెరువు ఉండదు. ఉండడానికి ఇల్లు ఉండదు. తినడానికి తిండి ఉండదు. చదువు మధ్యలో మానేయడం వల్ల సమాజ పోకడలు తెలియవు. సమాజంలో ఏ విధంగా బతకాలో ఏమాత్రం అవగాహన ఉండదు. మూఢ నమ్మకాలు, ముడి సాం ప్రదాయాల మధ్య రకాల అపోహలతో అనామకులుగా అత్యంత దీనావస్థలో బతుకు లీడుస్తున్నారు. తిండిలేక విపరీత పౌష్ఠికాహారలోపం, రక్తహీనత, మలేరియా, టైఫాయిడ్‌, కామెర్లు, టిబి, రొగ నిరోధక శక్తి తక్కువగా ఉండడం, గర్భంలోనే సరిగా ఎదగని బిడ్డలు పుట్టడం జరుగుతున్నాయి. మాతా శిశుమరణాలు, పరిశుభ్రత తెలియక వివిధ రకాల జబ్బులు, అనేక అంటువ్యాధులు, సుఖరోగాల బారిన పడుతున్నారు. 13 ఏళ్ళకే పెళ్ళిళ్ళు జరగడం వల్ల 35 ఏళ్ళకే ముసలితనం ఛాయలు కనిపించగా, మరికొందరు అతి చిన్న వయసులోనే భర్తను కోల్పోవడం నల్లమలలో షరా మామూలైపోయింది. చెంచులకు పౌష్ఠికాహార కొరత తీర్చి బాలింతలను పరిపుష్ఠి చేసే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన పౌష్ఠికాహార కేంద్రాలు వివిధ కారణాల రీత్యా చెంచుల దరి చేరడం లేదు.
ఎజెన్సిలో ఉన్న వైద్య సేవలు ప్రభుత్వం లెక్కలు చూపించుకోవడానికి మాత్రమే పనికొస్తున్నాయి. ఆధునిక యుగంలో అందుబాటులోకి వచ్చిన వైద్యం, చెంచులకు ఎన్నటికీ అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది. దాదాపు 99 శాతం ప్రసవాలు ఆడవిలోనే అత్యంత ప్రమాదకర పరిస్థితుల మధ్య జరిగిపోతున్నాయి. తల్లి పిల్లలు బతకడం దేవుడి మీదే భారం.

సకల సమస్యలకు పరిష్కారానికి మూలమైన విద్య, ఇతరత్రా అనేక సామాజిక కార్యక్రమాలు ముఖ్యంగా బాల్య వివాహాల కారణంగానే చెంచుల దరి చేరలేదు. నిజాం కాలంలో, అమ్రాబాద్‌, మన్ననూర్‌ చెంచుగూడెల్లో, బ్రిటిష్‌ వారు 100 సంవత్సరాల క్రితం కర్నూలు జిల్లా బైరూట్లిలో చెంచుల కోసం ప్రత్యేకంగా పాఠశాలలు ఏర్పాటు చేశారు. ఐనప్పటికీ ఇప్పటికీ వారి అక్షరాస్యత 26 శాతం దాటలేకపోతోంది. ప్రస్తుతం ఆ పాఠశాలలు పిల్లలు లేక వెలవెల బొతున్నాయి. పాఠశాలలు వారికి ఆహారం, సబ్బులు అందిచే కేంద్రాలుగా మారిపోతున్నాయి. కారణం- పాఠశాలలో ఉండాల్సిన పిల్లలే పెద్దలై, సంసార బాధ్యతలు నెత్తినవేసుకోవడమే. బాల్య వివాహల వల్ల తలెత్తిన ఇంకొక ముఖ్యమైన దుష్పరిణామం- విపరీత ఆత్మహత్యలు. మోసం, దగా తెలియని చెంచులు కుటుంబ తగాదాలతో నాటు సారాకు బానిసలై, అడవిలోని విషపూరిత ఆకులు, పసర్లు తాగి, మరికొందరు ఉరేసుకుని బలవన్మరణం పొందుతున్న సంఘటనలు చెంచు పెంటల్లో కొకొల్లలు. ఫలితం పిల్లలు అనాథలు కావడంతో ఒక తరం పూర్తిగా అభివృద్ధికి దూరం.
చెంచుల సగటు ఆయుః ప్రమాణం 40-50 సంవత్సరాలంటే నమ్మశక్యం కాని విషయం. అత్యంత స్వల్ప జనాభా కలిగిన, పర్యావరణ పరిరక్షకులైన చెంచుజాతి వారు నశించి పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.


Visalaandhra

దుర్భర జీవితాలు గడుపుతున్న చెంచులు

Thu, 17 Nov 2011, IST    vv
మౌలిక సదుపాయాలు కూడా అందని వైనం-కనీస రక్షణ కరువు
మహబూబ్‌నగర్‌టౌన్‌ (వి.వి) : జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో చెంచులు దుర్భర జీవితం గడుపుతున్నారు. ఎన్ని పథకాలు వచ్చినా వారికి మాత్రం సరైన ప్రయోజనాలు అందడం లేదు. కనీస సౌకర్యాలు కూడా పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నారు. రక్షణ కూడా కరువైన పరిస్థితుల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. అసలే అటవీ ప్రాంతం...విషపూరితమైన క్రిమికీటకాలు...క్రూరమృగాలతో సహజీవనం. నివాసం గుడారా లలో....ఇలాంటి స్థితిలో వారికి కనీస రక్షణ కూడా లేదు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో వివిధ చోట్ల సుమారు 20 వేల వరకు జనాభా వున్నట్లు ప్రభుత్వం అంచనా. వీరికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించి మెరుగైన జీవనం సాగించేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది. వివిధ శాఖల ద్వారా ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయల నిధులు ఖర్చు చేస్తోంది. వాటి ఫలితాలు మాత్రం చెంచులకు అందడం లేదు. ప్రభుత్వం చెబుతున్నవేమీ తమకు దక్కడం లేదని చెంచువాసులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, ఇతర శాఖల అధికారులు మిమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎప్పటికప్పుడు చెబుతున్నప్పటికీ ఎక్కడ అది ఆచరణకు నోచుకోవడంలేదనే విషయం వారి జీవన పరిస్థితులను పరిశీలిస్తే అర్థమవుతుంది. జిల్లాలోని లింగాల మండలం ఎర్రపెంటను పరిశీలించ గా...ఇక్కడి ప్రజలు దుర్భర పరిస్థితుల మధ్య తమ జీవనం సాగిస్తున్నారు. తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు మౌలిక సదుపాయాలను కల్పించడంలో ఈ ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు. తమకు వుండేందుకు ఇళ్ళు కూడా లేవని, గుడారాలల్లో జీవనం సాగిస్తున్న తమను పట్టించుకునే నాథుడు కరువయ్యాడని వారు ఆందోళన వ్యక్తం చేశారు. తమ గ్రామానికి ఇక్కడి ప్రజాప్రతినిధులు కేవలం ఓట్ల సమయంలో వస్తున్నారు తప్ప గెలిచిన తరువాత ఎవ్వరూ తమ గ్రామాల వైపు కన్నెత్తి కూడా చూడడంలేదని వారు అంటున్నారు. చెంచుల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన మాడా, ఐటిడిఎ శాఖల అధికారులు కూడా తమను పట్టించుకోవడం లేదని, వారు ఎవ్వరూ కూడా గ్రామాలను సందర్శించిన దాఖలాలు లేవని తెలిపారు. ముఖ్యంగా ఐటిడిఎ, మాడా శాఖల ద్వారా చెంచుల అభివృద్ధి కోసం అనేక పథకాలను ప్రవేశపెడుతున్నారు. వీటివల్ల చెంచులకు ఒరిగేది శూన్యమనే చెప్పాలి. ముఖ్యంగా ఇక్కడి చెంచులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వారికి ఉపాధి అవకాశాలను మెరుగుపర్చడంతో పాటు వారికి కావాల్సిన కనీస మౌలిక సదుపాయాలు, ఇళ్ల నిర్మాణం వంటి వాటిపై దృష్టి సారించాల్సిన ఈ శాఖలు తమ బాధ్యతను పూర్తిగా విస్మరించాయి. ప్రభుత్వం తమకు పక్కా ఇళ్ళు నిర్మిస్తుందని ప్రకటిస్తున్నా వాస్తవాలు మాత్రం అందుకు విరుద్దంగా వున్నాయని, ఆధికారులను కలిసి తమకు ఇళ్ళు నిర్మించి ఇవ్వాలని కోరితే మీరు సగం ఖర్చు పెడితే మిగితాది ప్రభుత్వం భరిస్తుందని సమాధానం ఇస్తున్నారని, తాము అంత సొమ్మును పెట్టే పరిస్థితి ఉంటే ఇక్కడ ఎందుకు జీవనం సాగిస్తామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 20 సంవత్సరాల కాలంలో ఎప్పుడూ ఇక్కడ ఎలాంటి ఇళ్ళు మంజూరు చేయలేదని, 20 సంవత్సరాల క్రితం ఇక్కడ ప్రభుత్వం కట్టిన ఇళ్ళు కొన్ని కూలిపోగా, మరికొన్ని శిథిలావస్థకు చేరుకున్నాయని చెంచులు తెలిపారు. ఇక్కడ ఉండే వాతావరణ పరిస్థితుల కారణంగా వివిధ రకాల వ్యాధుల బారినపడి 40 ఏళ్ళకు మించి ఎవ్వరూ బ్రతకడం లేదని, 50ఏళ్ళలోపే మృత్యువాత పడుతున్నారని వారు తెలియచేశారు. జిల్లా వైద్యశాఖ అధికారులు ఈ విషయంపై దృష్టి కేంద్రీకరించకపోడం, వైద్యులు ఎవ్వరు కూడా ఇక్కడికి రాకపోవడం వల్ల తాము వ్యాధులతో బాధపడుతున్నామని చెప్పారు. ఇక్కడి పిల్లలకు కనీస విద్యను అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.
ఇక్కడ గతంలో ఏర్పాటు చేసిన పాఠశాల ఏనాడు తెరుచుకున్న దాఖలాలు కూడా లేవు. అంగన్‌వాడి కేంద్రం సైతం శిథిలావస్థకు చేరుకుందని, ఇక్కడ నియమించిన ఉపాధ్యాయులు, అంగన్‌వాడి కార్యకర్తలు ఎవ్వరు కూడా ఈ ప్రాంతాలకు రారని వారు చెప్పారు. మరి ఇక్కడ పనిచేయాల్సిన ఉపాధ్యాయులు ఎక్కడ పనిచేస్తున్నారు, ఇక్కడ పిల్లలకు కేటాయించే అంగన్‌వాడి సరుకులు ఎక్కడికి పోతున్నాయనే విషయంపై అధికారులే సమాధానం చెప్పాల్సిన అవసరం వుంది. మొత్తం మీద ఇక్కడి చెంచులు అభివృద్ధికి అమడ దూరంలో...కటిక దారిద్య్రంలో నివసిస్తున్నారు.

Share EmailPrint