Pages

Wednesday, 5 February 2014




Namasthe Telangana

2/2/2014 1:53:57 AM
 
 
వనదేవతల జాతర
తరతరాల సాంప్రదాయం మనది. వేల సంవత్సరాల ఆచార వ్యవహారాలు మనవి. తరాలు మారుతున్నా అంతరాలు పెరుగుతున్నా సంస్కతి సాంప్రదాయాలు కొత్త పుంతలు తొక్కుతూ తన ఆస్తిత్వాన్ని చాటుకుంటూ కంప్యూటర్ యుగంలో కూడా విషసంస్కతి నుంచి విడిపోతూ తనని తాను కాపాడుకుంటూ వందల సంవత్సరాల జాతరకు ప్రతీకలై నిలుస్తున్న ఓరుగల్లు జిల్లాలోని తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క సారమ్మ జాతర ప్రపంచ మానవాళి చరిత్రలోనే ఓ అద్భుత ఘట్టం. ఓ అరుదైన సంఘటనలకు నెలువైన ప్రాంతం రాచరికపు వ్యవస్థపై దోపిడీ పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా తమ జాతి జనుల కోసం ప్రాణాలర్పించిన సమ్మక్క సారమ్మలను వనదేవతలుగా నాటి నుంచి నేటివరకు కొలుస్తూనే వున్నాం.

భవిష్యత్ తరాలు కూడా ఎన్ని ఒడుదుడుకులు ఎదురైనా నిస్సందేహంగా వన దేవతలు ఇలవేల్పులై (గోండుకోయలు) ఇలవేల్పయి పూజింపబడుతూనే ఉన్నారు. ఎన్నో అరుదైన వక్షజాతుల సమూహం కిలకిల పలికే కోయిల రాగాలా సమాహారం కల్మషం లేని స్వచ్ఛతకు నిలువెత్తు నిదర్శనమై జంపన్న వాగై ప్రవహిస్తూ, నిత్యం కుటుంబ జీవితమంటే ప్రేమానురాగాలే జనం కోసమే బ్రతకాలి. జనం కోసమే చావాలి అని చెప్పిన కుటుంబం సమ్మక్క పై డిద్ధ రాజుల కుటుంబం.

ఈ ఆధునిక యుగంలో ఒక చిన్న సంఘటన జరిగితే ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పే రాజకీయ నాయకులు తమ ఇంట్లో సమస్య వస్తే ఊరందరి సమస్యల చూసే స్వార్థపూరిత నాయకులు వనదేవతల చరిత్రను నేటికీ పూర్తిస్థాయిలో ప్రజలకు అందించలేదు. పైగా అక్కడ కూడా కాసులకు కక్కుర్తిపడి గుళ్ళు గోపురాలు కట్టి గిరిజన సాంప్రదాయాలకు, ఆచార వ్యవహారాలకు శఠగోపం పెడుతున్నారు. ఎవరో కొంతమంది అధికారంలో ఉండి చనిపోతే వారిపేర్లమీద జిల్లాల పేర్లు, మండలాల పేర్లు ఏర్పాటు చేసిన సంఘటనలు లెక్కకు మించినవి. కానీ మన సమ్మక్క సారలమ్మ వందల సంవత్సరాల పూర్వమే అడవిబిడ్డల కోసం అన్యాయాన్ని ఎదిరించి వీరనారులైండ్రు.

ప్రభుత్వం కాస్త ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ, భారీ ప్రకటనలు చేస్తూ ఏర్పాట్లు భారీగా చేస్తున్నామంటూ అవినీతి రాజకీయ నాయకుల అభివద్ధి కోసం పనులు వారికి కట్టబెడుతూ అడవి బిడ్డలను పక్కన పెడుతున్నారు. ఏ జనం కోసం సమ్మక్క వీరనారి అయ్యిందో ఆ జనాన్నే నేడు పాలకులు ధనం కోసం ముంచుతున్నారు. మరో ప్రమాదకరమైన విషయం ఏమిటంటే ఓ నాడు మేడారం అంటే ఓ అందమైన వనదేవతల నెలవు. కానీ నేడు పూర్తిగా మారిపోయింది. మేడారం కాస్త ఓ కాంక్రీట్ జంగిల్‌లా మారింది. అభివద్ధి పేరు మీద వక్షాలను నరికివేస్తూ నరరూప రాక్షత్వాన్ని ప్రదర్శిస్తూ పచ్చని వనదేవత తీరని ద్రోహం చేస్తూ సంబురాలు చేసుకుంటున్నారు. వక్షాలపై ఆధారపడి జీవనం సాగించే అనేక రకాల పక్షి జీవజాలం అంతరించిపోయే దశకు చేరుకుంది. అడవి జంతువుల మాట మచ్చుకైన కనిపించడంలేదు. దానికితోడు అనేక విధాలుగా అడవిబిడ్డల అనేక రకాలు ఇబ్బందులకు గురిచేస్తున్నారు.

మేడారం జాతర ప్రపంచంలోనే ఓ అరుదైన సంఘటన అనటంలో ఎటువంటి సందేహంలేదు. దాదాపు కోటిమంది ప్రజలు దేశం నలుమూలల నుంచి వచ్చి ముచ్చటగా మూడురోజుల పండుగకు సిద్ధమవుతారు. వారి రాకతో వన దేవతలు పులకించిపోతారు. కాని వచ్చేవారు.

వస్తూ పోయేవారు పోక ఆ ప్రాంతాల్ని పర్యావరణ కాలుష్యంలో నింపివేసి వెళ్ళుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోవాలి. జాతర మీద వచ్చే ఆదాయంపై ఆశ పడకుండా జాతర పవిత్రతను ప్రత్యేకతను ప్రజలందరికి పేపర్ల ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా విస్త్రత ప్రచారం కల్పించి మేడారం భక్తులందరికి ప్లాస్టిక్ కవర్లు, వాటర్ బాటిల్స్ తీసుకురాద్దని, చెట్లను తొలగించవద్దని ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా ప్రకటనలు చేస్తూ ఉండాలి. జాతరలో విఐపీలు వీవీఐపీలు అంటూ సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలకు స్వస్తిపలకాలి. వనదేవతల ముందు అందరూ సమానమే అన్న నినాదాన్ని ప్రతి ఒక్కరూ గమనంలో ఉంచుకోవాలి.

వన దేవతలు గద్దెల మీద చేరేటప్పుడు అధిక శబ్దం చేసి ముందుగుండు సామాగ్రి అసలు కాల్చకపోవడం మంచిది. దానివల్ల శబ్ద, వాయుకాలుష్యం పెరిగి అమ్మవార్ల పవిత్రను అపవిత్రం చేస్తున్నారు. విజ్ఞతగల పౌరులుగా జాతరతో పాల్గొని మధురమైన జ్ఞాపకాలను వనదేవతల ఆశీస్సులను అందుకొని భావితరాలకు ఓరుగల్లు చరిత్రను మరీ ముఖ్యంగా మేడారం పవిత్రతను కాపాడవలసిన బాధ్యత మనందరిమీద ఉంది.

1. అన్ని రాజకీయ పార్టీలు మేడారం పవిత్రత పట్ల స్పష్టమైన ప్రకటన చేయాలి.
2. గిరిజన విశ్వవిద్యాలయం తాడ్వాయిలో ఏర్పాటు చేయాలి.
3. గిరిజనులకు మాత్ర మే అభివద్ధి కార్యక్రమాలు కాంట్రాక్టు ఇవ్వాలి.
4.అడవి పై అధికారాలు, జాతరపై వచ్చే ఆదాయం అడవి బిడ్డలకే చెందాలి.
5. మేడారంలోని జీవవైవిధ్యాన్ని కాపాడడానికి అసెంబ్లీ ప్రత్యేక చట్టం తేవాలి.
6. గిరిజనుల ఆచార వ్యవహారాలను కచ్చితంగా జాతరకు వచ్చేవారు పాటించాల న్న జీవోలు ప్రభుత్వం విడుదల చేయాలి.
7. మేడారాన్ని కాలుష్యరహిత ప్రాంతంగా ప్రకటించాలి.
8. ప్లాస్టిక్ బాటి ల్స్, ప్లాస్టిక్ కవర్లు తీసుకురాకుండా గుడ్డసంచులు తీసుకురావాలని భక్తులకు పిలుపునివ్వాలి.
9. వ్యక్తిగత రవాణాను నిలిపివేసి, ప్రజారవాణాన్ని ప్రభుత్వం ప్రోత్సహించాలి. అనవసరపు శబ్దాన్ని తగ్గిద్దాం.
10.జీవహానిని నిర్మూలిద్దాం.
11. మేడారం ప్రాంతం అభివద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించి, ప్రత్యేక చొరవ చూపించాలి.
12. వందకోట్ల రూపాయల నిధులు కేటాయించి, ప్రపంచస్థాయి గిరిజన మ్యూజియం ఏర్పాటు చేయాలి.
-సీహెచ్ భద్ర, పర్యావరణవేత్త

Namasthe Telangana

5/2/2014 12:06:41 AM
జన జాతర మేడారం
కరువు పీడితులైన ప్రజల నుంచి కప్పం వసూలు చేయడాన్ని, సమ్మక్క, సారలమ్మలు వ్యతిరేకించారు. కాకతీయ పాలకులకు ఎదురు తిరిగి, తమ శౌర్య పరాక్రమాలు, పౌరుషాన్ని, ధీరత్వాన్ని ప్రదర్శించి వీరమరణం పొందా రు. ఆనాటి నుంచి ప్రతి రెండేళ్ల ఒకసారి నాలుగు రోజు లు అతి వైభవంగా జరిగే పండుగే సమ్మక్క సారలమ్మ జాతర. వీరనారీమణులు స్మత్యర్థం ఆదివాసీలు ఈ జాతరను జరుపుతారు. ఈ జాతర ఆదివాసీ, గిరిజనుల సం స్కతి, సాంప్రదాయాలకు, ఆత్మగౌరవానికి ప్రతీకలుగా భావిస్తారు. భక్తులు సమ్మక్కను తల్లిగా సారలమ్మను ఆడపడుచుగా కొనియాడుతారు.

దేశం నలుమూలల నుంచి కోటికిపైగా భక్తులు ఈ జాతరకు వస్తారు. తల్లిబిడ్డలుగా ఖ్యాతిచెందిన ఈ దేవతలు గిరిజన తెగలలోని కొని గోత్రాలకు చెందిన కోయవారిచే సాంప్రయాలకనుగుణంగా పూజించబడుతున్నారు. జాతర సమయంలో గద్దెనుంచి మూడు కిలోమీటర్ల దూరంలోగల కన్నెపల్లి గ్రామం నుంచి సారలమ్మను బుధవారం సాయంత్రం వైభవంగా గద్దెకు చేర్చుతారు. గురువారం సాయంత్రం గద్దె నుంచి కిలోమీటర్ దూరంలో గల చిలకలగుట్ట నుంచి వారి సాంప్రదాయ నత్యాల, వాయిద్యాలతో, గౌరవ సూచకంగా పోలీసు అధికారులు గాలిలోకి కాల్పు లు జరిపి కట్టుదిట్టమైన బందోబస్తుతో కుంకుమ భరణి రూపంలో ఉన్న సమ్మక్క దేవతను జన సముద్రం నుంచి వైభవంగా గద్దెకు చేరుస్తారు. గోవిందరాజు, పగిడిద్దరాజులను కొత్తగూడ మండలం పునుగొండ గ్రామం నుంచి గద్దెలకు తీసుకొస్తారు.

గద్దెకు చేరిన దేవతలకు భక్తులు కానుకలను సమర్పిస్తారు. ప్రారంభం లో గిరిజనులు మాత్రమే ఈ జాతరలో అధికశాతం పాలుపంచుకునేవారు. వీరు ఆర్థికంగా, సామాజికంగా వెనకబడి ఉండటం వల్ల తక్కువ ఖర్చుతో కూడిన కానుకలైన ఎదురు కోళ్ళు, బెల్లాన్ని సమర్పిస్తారు. తాము సమర్పించే బెల్లాన్ని బంగారంతో సమానంగా భావిస్తారు. తమ ఎత్తు(బరువు) బంగారాన్ని దేవతలకు కానుకలుగా ఇస్తారు. కొత్త పసుపు రంగు గుడ్డలో కుంకుమ బియ్యం, రెండు కొబ్బరి కుడుకలు, రెండు రవిక ముక్కలు, రెండు వక్కలు, ఖర్జూరాలు వేసి భక్తులు నడుముకు కట్టుకుంటారు. అందులో నుంచి రెండు రవిక ముక్కలు కొద్ది బియ్యం దేవతల కు సమర్పిస్తారు. మిగిలినవి తమతో తీసుకువెళ్ళడం వల్ల స్వయంగా దేవత సమ్మక్కే తమ ఇంటికి వచ్చినట్టుగా నమ్ముతారు. ఈ జాతరలో మాంసాహారం, మద్యపానం వాడడం ఆనవాయితి. అసంఖ్యాకంగా భక్త జనం స్నానాలు ఆచరించి శివసత్తులు తమ కోరికలు కోరుకుంటా రు. జంపన్న వాగులో స్నానం చేసిన తరువాతే మొక్కులు సమర్పిస్తారు. శనివారం దేవతలు తిరిగి వనప్రవేశం చేయడంతో ఈ జాతర ముగిసిన ట్టు ప్రకటిస్తారు.

ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద, దక్షిణ భారతదేశంలోనే గిరిజన కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన మేడారం జాతర ప్రతి పండుగకు ముందు విమర్శలు అధికార యంత్రాంగం ఆరాటం ఆర్భాటంతో మొదలైన కోట్లా ది రూపాయలు వెచ్చించినా శాశ్వతమైన సౌకర్యాలు లేక జాతర అనంతరం కాలుష్యంతో అక్కడి గిరిజనులకు మిగిలేది కష్టాలు, సమస్యలే. జాతర ప్రారంభానికి ఆరునెలల ముందు నుంచి పనులు ప్రారంభింస్తుం ది. ప్రణాళిక ప్రకారం గిరిజనులు మనోభావాలు దెబ్బతినకుండా ప్రతి జాతరకు సౌకర్యాలు మెరుగుపరుస్తూ, జాతర ప్రాముఖ్యాన్ని ప్రాచుర్యంలోకి తెస్తారు. గిరిజనుల మనోభావాలు, భక్తుల సూచనలు ఆచరణలోకి రాకపోవడం శోచనీయం. ఇతర ప్రాంతాలలో ఉన్న దేవాలయా లు, పురాతన కట్టడాలపై ఉన్నశ్రద్ధ, తెలంగాణలోని గిరిజన నియోజకవర్గమైన ములుగు ప్రాంతంలోగల సమ్మక్క సారలమ్మ జాతరపై లేదు. ఈ ప్రాంతం అభివద్ధికి నోచుకోకపోవడమే కాదు పర్యాటక కేంద్రంగా గుర్తింపు రాలేదు. ఈ ప్రాంత ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యమే దీనికి కారణమనే విమర్శలు ఉన్నాయి.

ముఖ్యంగా అరకొర సౌకర్యాలున్నా లక్షలాది మంది భక్తులు ఈ జాతరలో భక్తి శ్రద్ధలతో అవాంఛనీయ సంఘటనలు లేకుండా వ్యయ ప్రయాసలకోర్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వేంకటేశ్వరస్వామి పేరును పెట్టుకున్నట్టుగానే తెలంగాణలో చాలామంది తమ పిల్లలకు సమ్మయ్య, సమ్మక్క, సారలమ్మ సారయ్య, జంపన్న అని పేర్లు పెట్టుకోవడం మనకు కనిపిస్తుంది. సమ్మక్క, సారలమ్మలపై ఉన్న అపారమైన నమ్మకమే దీనికి కారణం.
ఇన్ని విశిష్టతలు గల ఈ జాతరను ప్రభుత్వం మేడారం జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించాలి. ఈ జాతర చరిత్రను పాఠ్యపుస్తకాలలో పాఠ్యాంశంగా చేర్చాలి. తరిగిపోతున్న సహజ సంపద, అటవీ సంపదను, ఔషధ మొక్కలను, కంక వనాలను పెంపొందించాలి. దీన్ని వన్యప్రాణుల సంరక్షణ ప్రాంతంగా అభివద్ధి చేయాలి. కలగా మిగిలిన కంతనపల్లి ప్రాజెక్టును నిర్మించి సాగు,తాగునీటిని అందించాలి. అలాగే ఈ ప్రాంతా న్ని పర్యాటక కేంద్రంగా అభివద్ధి చేయాలి.

ఈ జాతరకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుపెడుతున్న కోట్ల రూపాయలు ఒక ప్రణాళికా ప్రకారం వెచ్చిస్తే ప్రభుత్వాలు విమర్శలకు గురికావు. మొక్కులు చెల్లించే సమయంలో కొబ్బరికాయలు, బెల్లం గద్దెపైకి విసిరే సమయంలో అనేకమంది భక్తులకు గాయాలవుతున్నాయి. దీని నివారణకు ఎన్ని సూచనలు చేసిన ప్రయోజనం ఉండడం లేదు. జాతర ప్రాం తంలో అక్కడక్కడ చెత్తకుండీల మాదిరిగా తాత్కాలిక కుండీలను జాతర నిర్వాహకులు ఏర్పాటు చేయాలి. ఈ ప్రాంత అభివద్ధికి పర్యావరణ వేత్తలు, సామాజికవేత్తల, ఆదివాసీ, గిరిజన విద్యావంతులతో కూడిన కమిటీ వేయాలి. వారి సూచనల ఆధారంగా శాశ్వత ప్రణాళికలు రూపొం దిం చాలి. జాతర సమయంలో పంట నష్టపోతున్న స్థానికులకు పంట నష్టపరిహారం చెల్లించాలి.
ఈ ప్రాంతంలోని ప్రకతి నిలయమైన ప్రతి జీవరాశి వస్తువు సమ్మక్క, సారలమ్మ ప్రతిరూపాలు. వీటికి హాని తలపెట్టకూడదు. ప్రకతి వరమైన వారసత్వ సంపదను పరిరక్షించుకోవడం, అంతరిం చిపోతున్న వన సంపదను కాపాడుకోవడం మనందరి బాధ్యత.



పొఫెసర్ ఎ. సీతారాం నాయక్
కాకతీయ యూనివర్సిటీ